DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇక పై రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే పీహెచ్‌ డీ ప్రవేశ పరీక్ష : ఏయూ వీసీ నాగేశ్వరరావు 

ఏపి ఆర్‌సెట్‌ నోటిఫికేషన్‌ 30à°¨ విడుదల
మొత్తం 73 విభాగాల్లో ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు
విశాఖపట్నం, జూన్‌ 28 , 2018 (డిఎన్‌ఎస్‌) : ఇక పై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏ

విశ్వవిద్యాలయం లో నైనా పీహెచ్‌ à°¡à±€ లో చేరాలంటే ఒకే కామన్‌ పరీక్ష వ్రాయవలసిన తప్పని సరికానుంది. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనల్లో

ప్రవేశాలకు తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపిరీసెర్చ్‌ సెట్‌ నోటిఫికేషన్‌ను à°ˆ నెల 30 à°µ తేదీన విడుదల చేస్తున్నట్లు ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ ఉపకులపతి డాక్టర్‌

జి.నాగేశ్వర రావు తెలిపారు. గురువారం ఏయూ సెనేట్‌ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లదించారు  à°†à°‚ధ్ర ప్రదేశ్‌ లోని 14 విశ్వవిద్యాయాలలో 73

విభాగాలో పిహెచ్‌à°¡à°¿, ఎంఫిఎల్‌ కోర్సులకు ప్రవేశాలను ఏపిఆర్‌సెట్‌తో నిర్వహించడం జరుగుతుందన్నారు. సెట్‌ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఏయూకు అప్పగించిందన్నారు.

ఏపిఆర్‌సెట్‌ నోటిఫికేషన్‌ను à°ˆ నెల 30à°µ తేదీన విడుదల చేస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ జూలై 4à°µ తేదీ నుంచి నిర్వహిస్తామని, జులై 25à°µ తేదీ

వరకు దరఖాస్తును స్వీకరిస్తామన్నారు. రూ 2 వేల అపరాధ రుసుముతో ఆగష్టు 3వ తేదీ వరకు, రూ 5 మే అపరాధ రుసుముతో ఆగష్టు 10వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందన్నారు.

హాల్‌ టికెట్లను ఆగష్టు 14 నుంచి 17à°µ తేదీ వరకు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునన్నారు. ప్రవేశ పరీక్షను ఆగష్టు 22 నుంచి 24à°µ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. దరఖాస్తు రుసుముగా

ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు రూ 1000, ఇతయి రూ 1400 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశలో పరీక్షలో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45 శాతం

మార్కులు సాధిస్తే అర్హత పొందుతారన్నారు. పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అము చేస్తున్నామన్నారు. వ్రాత పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు మౌఖిక

పరీక్ష(ఇంటర్వ్యూ)కు హాజరు కావాలన్నారు. విద్యార్థి ఎంపిక చేసుకున్న విశ్వవిద్యాలయంలో మౌఖిక పరీక్ష నిర్వహిస్తామన్నారు. అనంతరం విద్యార్థులకు ర్యాంకు

కేటాయించి వీటి ఆధారంగా ఖాళీలు భర్తీ చేయడం జరుగుందన్నారు. పిహెచ్‌డిలో 2400, ఎంఫిఎల్‌లో 500 సీట్లు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ

రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమా మహేశ్వర రావు, ఏపిఆర్‌సెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాస రావు, మీడియా రిలేషన్స్‌ డీన్‌ డాక్టర్‌ పి.బాబి వర్థన్‌ తదితరులు

పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam