DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్జాతీయ న్యాయస్థానానికి చేరిన అమరావతి ఉద్యమం ...

*యూఎస్ ఎన్నారైల తరపున కావేటి శ్రీనివాస్ ఫిర్యాదు దాఖలు* 

*అమరావతి పరిరక్షణ సమితి ఎన్నారై విభాగం తరపున ఫిర్యాదు*

*(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి)*

అమరావతి, మార్చి 03, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°…మరావతిలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతొందంటూ హేగ్‍లోని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‍లో అమెరికా ఎన్నారైల

ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న రైతులు, మహిళలపై జరుగుతున్న దమనకాండపై ఫిర్యాదు చేశారు. యూఎస్ ఎన్నారైల తరపున శ్రీనివాస్ కావేటి

ఫిర్యాదు చేసారూ. అమరావతి పరిరక్షణ సమితి ఎన్నారై విభాగం తరపున హేగ్ కోర్టులో ఫిర్యాదు చేసారు. అమరావతిపై ఫిర్యాదును అంతర్జాతీయ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

వీళ్ళ ఫిర్యాదు స్వీకరిస్తున్నట్లు  à°ªà±à°°à°¾à°¸à°¿à°•à±à°¯à±‚టర్ నుంచి అక్‍నాలెడ్జ్ మెంట్ కూడా పొందినట్టు తెలుస్తోంది. అయితే ఇది భారత దేశంలోని à°’à°• రాష్ట్రానికి

సంబంధించిన అంశం కావడంతో త్వరలో నిర్ణయం తీసుకున్నాక సమాచారం ఇస్తామని ప్రాసిక్యూటర్ తెలిపినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ కోర్టు దృష్టికి వెళ్లడం తో తమకు

న్యాయం జరుగుతుందన్నా అంశాభావం లో అమరావతి రైతులు ఉన్నారు. అమరావతి రైతుల వీళ్ళ నిరసనలకు మొదట్నుంచి మద్దతు తెలియచేస్తున్నారు. త్వరలో జెనీవాలోని

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘానికి కూడా  à°…మరావతిలో మానవ హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వీడియో ఆధారాలతో సహా ఫిర్యాదు

చేస్తామంటున్న ఎన్నారైలు ప్రకటించారు. ఉద్యమంలో పాల్గొన్న రైతులు, మహిళల అక్రమ నిర్బంధం, అరెస్టులపై అంతర్జాతీయ స్థాయిలో పోరాటం మొదలు పెట్టిన ఎన్నారైలు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam