DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్థానికంలో ఓడితే మంత్రైనా ఇంటికే : వైఎస్ జగన్. . .

మంత్రివర్గ సమావేశంలో సీరియస్ వార్నింగ్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, మార్చి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : త్వరలో జరుగనున్న స్థానిక

ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓడితే దానికి భాద్యులుగా ఆ జిల్లా మంత్రులని, ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే లను తక్షణం ఇంటికి పంపెయ్యడం జరుగుతుందని ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి, స్థానిక సంస్థల్లో కూడా

పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించాల్సిందేనని, ఓడితే మంత్రి ఇంటికే, ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే కు మరోసారి టికెట్ రద్దు చేస్తామని ప్రకటించినట్టు

తెలుస్తోంది.   

ఇక పరిపాలన పై : . . .

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతి లోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం

ముగిసింది. à°ˆ సందర్భంగా భేటీ వివరాలను రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు.  2010లో ఉన్న ప్రశ్నలకు పరిమితమవుతూ ఎన్‌పీఆర్‌లో మార్పులు

కోరుతూ కేబినెట్‌లో తీర్మానం ఆమోదించినట్లుగా మంత్రి వెల్లడించారు. మార్పులు చేసే వరకు రాష్ట్రంలో ప్రక్రియ నిలిపివేయాలని తీర్మానం చేశామన్నారు.  à°‰à°—ాదికి 25

లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం 26,976 ఎకరాల ప్రభుత్వ భూమిని, 16,164 ఎకరాల ప్రైవేట్ భూమిని కొనుగోలు చేశామని మంత్రి వెల్లడించారు.  à°ªà±‡à°¦à°²à°•à± ఇచ్చే

కాలనీలకు వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేశామని నాని తెలిపారు. ఇళ్లపట్టాలను ప్రభుత్వమే రిజస్టర్ చేయించి లబ్ధిదారులకు ఇస్తుందని, బ్యాంక్‌లో ఇళ్ల

పట్టాలు తనకా పెట్టి వ్యక్తిగత అసవరాలకు లోన్‌ తీసుకోవచ్చునని పేర్నినాని చెప్పారు.  à°ˆ ప్రక్రియను మరింత సులభతరం చెయ్యడం కోసం రాష్ట్రంలోని తహసీల్దార్‌లను

జాయింట్ రిజస్టర్‌లుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనుల్లో జీఎంఆర్‌కు ఇచ్చిన 2,700 ఎకరాలను 2,500కు కుదిస్తూ రాష్ట్ర మంత్రి మండలి

నిర్ణయించింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam