DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల అన్నమయ్య భవన్ వద్ద జర్నలిస్టుల నిరసన 

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ దృష్టిలో 26 మందే జర్నలిస్టులా? : పాత్రికేయుల మండిపాటు  

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తీరు మారాల్సిందే. . లేకుంటే నిరసనలు ఉధృతం. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి)

అమరావతి, మార్చి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : కోట్లాది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి వైభవాన్ని భక్తుల చెంతకు తీసుకు వెళ్లే ప్రసార

మాధ్యమాలపై à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులు ఆంక్షలు విధించడం పట్ల పాత్రికేయులు మండిపడుతున్నారు.  à°¤à°¿à°°à±à°®à°² లో జరిగే కార్యక్రమాల సమాచారాన్ని అందించడం కోసం వచ్చిన

జర్నలిస్టులను ఆంక్షల పేరుతో టీటీడీ అధికారులు తిరుమలలో అన్నమయ్య భవన్ వద్ద అడ్డుకోవడం, ఇబ్బందులకు గురి చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమే నని జర్నలిస్టుల

ఐక్యవేదిక నాయకులు కల్లు పల్లి సురేంద్ర రెడ్డి, కోలాలక్ష్మీపతి లు అన్నారు. 

కేవలం 26 మంది జర్నలిస్టులకు మాత్రమే అనుమతించడం, మిగిలిన వారిని సమావేశం హాల్

లోనికి అనుమతించకపోవడం హేయమైన చర్యగా వారు అభివర్ణించారు.  

వారం రోజుల్లో టిటిడి అధికారుల తీరు మార్చుకోకుంటే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు

చేపట్టాలని తిరుమల తిరుపతి జర్నలిస్టుల ఐక్యవేదిక నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయం, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సంస్థలను  à°…ధికారులు తమ సొంత జాగీరుగా భావించరాదని నాయకులు హితవు

పలికారు.  

టీటీడీ సంస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, అధికారుల అవినీతి ని ఎండగడుతూ వార్తలు రాసే జర్నలిస్టులపై టీటీడీ అధికారులు ద్వేషాన్ని పెంచుకోవడం,

వ్యక్తిగత కక్షలకు పూనుకోవడం, ఆర్ధిక మూలాలు దెబ్బతీసే అనైతిక చర్యలకు ఒడిగట్టడం మంచిది కాదని హెచ్చరించారు.  

టిటిడి సంస్థ ప్రతిష్ఠను కాపాడే బాధ్యత

అధికారులపైనే కాకుండా జర్నలిస్టులపై కూడా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తిరుమలలో మీడియా ప్రతినిధుల పట్ల విభజించు పాలించు అనే విధంగా టీటీడీ

అధికారులు కొంతమందిని మాత్రమే గుర్తించి వారికి మాత్రమే సమాచారం ఇస్తామనడం మీడియా స్వేచ్ఛను హరించడమే అని అన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని,

వారం లోపు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారుల తీరు మార్చుకోకుండా ఉంటే  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°· ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని జర్నలిస్టుల ఐక్యవేదిక సమావేశం తీర్మానించింది. à°ˆ సమావేశంలో

జర్నలిస్టులు కలకడ వేణుగోపాల్, శ్రీనివాసులు, ఈశ్వర్, గుణకల తిరుపాల్, ఆర్ హరిబాబు, రమేష్ స్వామి, జి.దినేష్, శేఖర్, రవీంద్ర నాథ్, గంధం ప్రభాకర్, రుద్రయ్య, బొజ్జయ్య,

తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam