DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనాపై అప్రమత్తంగా ఉండండి – సి ఎస్ నీలం సాహ్ని 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, మార్చి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన

కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్ లతో బుధ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కరోనాపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కేసులు వస్తే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. అవసరం మేరకు ఆ ప్రాంతంలో వైద్య పర్యవేక్షణ (సర్వేలెన్స్)

చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు సిద్ధంగా ఉంచాలని, ఎటువంటి పరిస్థితి నైనా ఎదుర్కోనుటకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రజల్లో పూర్తి స్ధాయి అవగాహన కల్పించాలని అన్నారు. వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడంపై చైతన్యం తీసుకురావాలని చెప్పారు. ప్రజలు చేయాల్సిన

అంశాలు, చేయకూడని విషయాలపై తెలియజేయాలని చెప్పారు. ఇతర దేశాల నుండి వచ్చే వాటికి ఎయిర్ పోర్ట్, పోర్టుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహించాలని, పర్యాటకులు, పర్యాటక

స్థలాల పై దృష్టి సారించాలని, పరిస్థితులను ఎదుర్కోనుటకు వ్యూహం ఉండాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా రమేష్ మాట్లాడుతూ భయపడాల్సిన అవసరం లేదని

స్పష్టం చేసారు. జ్వరం, జలుబు సాధారణంగా చాలా మందికి వస్తుందని, దానికి అపోహ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని గమనించాలని

చెప్పారు. ఎక్కువ నీరు తాగాలని, సాధారణ జ్వరం, జలుబు, నీరసం ఉంటే విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. మీడియా మరింత బాధ్యతాయుతంగా పనిచేసి వాస్తవ

పరిస్థితులను అందించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ జె నివాస్, పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జిల్లా రెవెన్యూ

అధికారి బలివాడ దయానిధి, డిఎంహెచ్ఓ డా.ఎం.చెంచయ్య, జిజిహెచ్ సూపరింటిండెంట్ డా కె.కృష్ణ మూర్తి, డిసిహెచ్ఎస్ డా బి.సూర్యారావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస

రావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam