DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పదవి నుంచి సంచయిత గౌరవంగా తప్పుకోవాల్సిందే. : విష్ణు కుమార్ రాజు

రాజవంశ కుటుంబంలో వైఎస్ జగన్ రాజకీయ చిచ్చు పెట్టారు

 

సంచయిత సింహాచలం గుడికి ఎన్నిసార్లు వెళ్లారు?

మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు

సూచన 

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం). . . .

విశాఖపట్నం, మార్చి 06, 2020 (డిఎన్‌ఎస్‌) : అర్ధరాత్రి తెచ్చిన జీవో తో కుటుంబ గౌరవానికి విరుద్ధంగా

సింహాచల క్షేత్రం, మాన్సాస్ సంస్థల చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన సంచయిత గజపతిరాజు గౌరవప్రదంగా తప్పుకోవాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు

సూచించారు. విశాఖనగరంలోని బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అండగా నిలిచినా పూసపాటి

రాజవంశీకుల ఇంట వైఎస్  à°œà°—న్ మోహన్ రెడ్డి చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఇంతకాలం వరకూ పూసపాటి వంశీకుల ఇంటి పెద్ద సజీవంగా ఉన్నంత  à°•à°¾à°²à°‚ మాన్సాస్ ట్రస్ట్

చైర్మన్గా వారే ఉన్నారని, ముందుగా పివిజి రాజు, అయన మరణానంతరం ఆనంద గజపతి, ఆయన మరణానంతరం అశోక్ గజపతి భాద్యతలు చేపట్టారన్నారు. ఈ కట్టుబాట్లకు విరుద్దంగా వైఎస్

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజుల కుటుంబంలో చిచ్చుపెట్టి అశోక్ గజపతి తీరని అవమానం చేశారన్నారు. 

సంచయిత సింహాచలం గుడికి ఎన్నిసార్లు వెళ్లారు?. .

ఇన్నేళ్ల కాలం లో సంచయిత సింహాచల దేవాలయానికి ఎన్నిసార్లు వెళ్లారు అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆమెకు పూసపాటి వంశీకుల ప్రభావం తెలుసా అని అడిగారు.

ఒక వంశాచారం ప్రకారం నడవాల్సిన విధానాలను తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. రాజకీయాలకు లొంగి భాద్యతలు చేపట్టవలసి వస్తే. . ముందుగా కుటుంబంలో ఒక అంగీకారానికి

వచ్చిఉండవలసిందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam