DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలిండియా పోర్ట్ క్రికెట్ పోటీల విజేత ముంబై జట్టు 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) . . .*

విశాఖపట్నం, మార్చి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : 39à°µ అఖిలభారత మేజర్ పోర్టు లే క్రికెట్ ఛాంపియన్షిప్ ఘనంగా ముగిసింది ముగింపు

కార్యక్రమాన్ని పోర్టు క్రికెట్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పోర్టు డిప్యూటీ చైర్మన్ హరినాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు గెలుపొందిన

చెట్లకు డిప్యూటీ చైర్మన్ బహుమతులు అందజేశారు ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన ముంబై జట్టును డిప్యూటీ చైర్మన్ అభినందించారు రన్నరప్ గా నిలిచిన విశాఖపట్నం

పోర్ట్ ట్రస్ట్ జట్టు మంచి పోరాట పటిమను కనబర్చిందని ఇచ్చారు ఇరు జట్లు విజయం కోసం శ్రమించటం తో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది అన్నారు క్రీడలు మానసిక

ఉల్లాసానికి దోహదం చేస్తాయని డిప్యూటీ చైర్మన్ అన్నారు ఈ సందర్భంగా టోర్నమెంటులో ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లకు మెమెంటో అందజేశారు.

శుక్రవారం మధ్యాహ్నం

ఒంటిగంటకు పోర్టు క్రికెట్ స్టేడియంలో ముంబై జట్టు విశాఖపట్టణం జట్ల మధ్య ఫైనల్ పోరు ప్రారంభమైంది టాస్ గెలిచిన ముంబై జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది దీంతో మొదట

బ్యాటింగ్కు దిగిన విశాఖపట్టణం జట్టు 19 ఓవర్లలో 131 పరుగులు చేసి ఇ ఆలౌట్ అయ్యింది అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు మరో నాలుగు బంతులు మిగిలి

ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది 39వ ఆలిండియా మేజర్ ఫోర్స్ క్రికెట్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది గత ఏడాది కూడా ముంబై జట్టు విజేత కావడం గమనార్హం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam