DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ట్రస్ట్ భూములు దోచడానికే చైర్మన్ మార్పు : సాధు పరిషత్ 

గుళ్ల కూల్చివేతపై నోరెత్తని ప్రభుత్వం, మరో దందాకు శ్రీకారం  

సంచయితను పావుగా వాడుతున్నారు : స్వామి శ్రీనివాసానంద ,  

అనాచారం జరిగితే

 à°¸à±à°¥à°¾à°¨à°¾à°šà°¾à°°à±à°¯à±à°²à± ఏమి చేస్తున్నట్టు ? . . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . 

విశాఖపట్నం, మార్చి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి,

సింహాచల క్షేత్ర పరిధిలోని వేలాది ఎకరాల భూములు, కోట్లాదిగా విలువచేసే మాన్సాస్ ట్రస్ట్ భూములను దోచేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సాధుపరిషత్ రాష్ట్ర

అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ వివాదం పై ఆయన DNS తో పలు అంశాలను చర్చించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

విజయనగరం పూసపాటి వంశస్థులు ప్రజా సంరక్షణ కోసం 1957 లో ఏర్పాటు చేసిన సంస్థే మాన్సాస్ అని. ప్రజలతో మమేకమై కార్యాచరణ చేసేందుకు వీలుగా ఆనాటి  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖ లో

నిజాయితీ గల్గిన అధికారులు ఉండడంతో వారి సూచనల మేరకు ఈ ట్రస్ట్ ను ప్రభుత్వ శాఖా తో కలిసి పనిచేసే విధంగా పివిజి రాజు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అయితే ఈ

రాజుల పై ప్రజలకు ఉన్న గౌరవం కారణంగా ఎందరో దాతలు కూడా వేలాది ఎకరాల భూములను ఈ ట్రస్ట్ కు విరాళంగా అందించారు. తర్వాత కాలంలో దేవాదాయ శాఖా లో ఉన్న భూ బకాసురులు,

అవినీతి రాబందుల కళ్ళు ఈ ట్రస్ట్ పై పడ్డాయన్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఈ ఆస్తులు దోచెయ్యడానికి ప్రభుత్వాలు చెయ్యని పని లేదన్నారు. అయితే ప్రజల కోసం రాజులు

ప్రారంభించిన సంస్థ కావడం, దీనికి అనుబంధంగానే సింహాచల క్షేత్రం ఆస్తులు కూడా ఉండడంతో స్వామే స్వయంగా రక్షిస్తున్నారనే విశ్వాసం అందరిలోనూ ఉందని

తెలిపారు. 

ప్రస్తుత మారుతున్న రాజకీయ రాబందుల ప్రణాళికల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న మాన్సాస్ ట్రస్ట్ ల చైర్మన్ అశోక్ గజపతి రాజు ( వ్యవస్థాపకులు పివిజి రాజు

కుమారులు) ను రాత్రికి రాత్రే తొలగించి, ఈ కుటుంబ సభ్యురాలిగా ప్రచారం కాబడుతున్న సంచయిత గజపతి ( ఆనంద గజపతి కుమార్తె) ను చైర్మన్ ను చెయ్యడం పట్ల సర్వత్రా విమర్శలు

తలెత్తుతున్నాయి. వేలాది ఎకరాల భూముల విలువ ప్రస్తుతం లక్షల కోట్లల్లో ఉంటుందని, దాన్ని దోచుకునేందుకే సంచయితను పావుగా వాడుతున్నారని

మండిపడ్డారు. 

సంప్రదాయం తెలుసుకోవాల్సిందే:. . . .

à°’à°• హిందూ దేవాలయంలోకి à°’à°• మహిళా గాని, పురుషుడు గానీ  à°œà±à°Ÿà±à°Ÿà± విరబోసుకు రావడం హిందూ సంప్రదాయానికి

విరుద్ధం అన్నారు. అలాంటిది ఈమె సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా / అనువంశిక ధర్మకర్త గా భాద్యతలు చేపట్టే సమయం లోనే ఆమె జుట్టు విప్పుకుని రావడం క్షమించరాని

తప్పిదం అన్నారు. ఆమె నియామకాన్ని తాము తప్పు పట్టడం లేదని, అయితే హిందూ సంప్రదాయ పరమైన విధివిధానాలు ఆమెకు తెలిసినట్టుగా అనిపించడం లేదన్నారు. 

అనాచారం

జరిగితే  à°¸à±à°¥à°¾à°¨à°¾à°šà°¾à°°à±à°¯à±à°²à± ఏమి చేస్తున్నట్టు ? . . .

హిందూ ఆలయంలో సంప్రదాయాలు సంచయితకు తెలియని పక్షంలో ఆలయ స్థానాచార్యులు ఏమి చేస్తున్నట్టు అని ప్రశ్నించారు.

అర్చకులు కూడా ఏ à°Žà°‚à°¡à°•à°¾ గొడుగు పడుతూ. . .వీళ్ళ అనాచారాలకు వంటపడుతున్నారని మండిపడ్డారు. ఆలయంలో అనాచారం జరిగితే భాద్యత స్థానాచార్యులదేనన్నారు. 

గుళ్ల

కూల్చివేతపై నోరెత్తని ప్రభుత్వం, మరో దందాకు శ్రీకారం : . . . 

రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై భౌతిక దాడులు చేస్తూ, ఆలయాలు కూలుస్తుంటే నోరెత్తని రాష్ట్ర

ప్రభుత్వం పెద్దలు, సింహాచలం క్షేత్రం పరిధిలోని వెలది ఎకరాల భూములను దోచుకునేందుకు మరో పెద్ద దందాకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆంధ్ర

ప్రదేశ్ సాధు పరిషత్ తప్పు పడుతోందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam