DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మొత్తం గ్రామ ఎన్నికలు ఏకగ్రీవమైతే భారీ నజరానా

సర్పంచ్, వార్డు సభ్యులు సహా అన్నీ ఏకగ్రీవమైన గ్రామాలకే వర్తింపు  

2 వేలలోపు జనాభా ఉంటె రూ. 5 లక్షలు, 10 వేలు ఉంటె రూ. 10 లక్షలు

ప్రభుత్వానికి ప్రతిపాదనలు

పంపిన పంచాయతీరాజ్‌ శాఖ

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 9 ,2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : గ్రామ ప్రజల్లో ఐక్యత తీసుకు వచ్చేందుకు రాష్ట్ర పంచాయితీ

రాజ్ శాఖా అద్భుతమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు, పోటీదారుల్లో వ్యతిరేకత లేకుండా చేసేందుకు నగదు పురస్కారాలను

ప్రకటించింది.  పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే à°† గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు

అందించనుంది. ఇలా ఏకగ్రీవాలు జరిగే చోట.. గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలను పంచాయతీరాజ్‌ కమిషనర్‌

గిరిజా శంకర్‌ ఇప్పటికే ప్రభుత్వానికి పంపారు. à°’à°•à°Ÿà°¿, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన జీవో వెలువడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గ్రామ పంచాయతీల ఎన్నికలు

రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా పార్టీ రహితంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను

అందజేస్తోంది. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. గ్రామాలకు ఏడాది

కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ గ్రాంట్లు అందు తున్నాయి. వీటితోపాటు పంచా యతీలు స్థానికంగా పన్నుల రూపంలో వసూలు చేసుకునే మొత్తానికి సమానంగా

ఏకగ్రీవమయ్యే గ్రామాలకు ప్రభుత్వం నిధులు అందజేసే అవకాశం ఉందని అంటున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam