DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ ఆస్తుల దోపిడీ చేస్తే అధోగతి పలు తప్పదు:

సింహాచల క్షేత్ర పవిత్రత కై à°—à°¿à°°à°¿ ప్రదక్షిణ చేస్తాం 

సింహాచల రాజుల క్షోభ రాష్ట్రానికి మంచిది కాదు : 

భూ దోపిడీ చేసేందుకు అయితే చైర్మన్ మార్పే

అవసరం లేదు 

ఏ ప్రభుద్ధుడైన ఒక్కటే హిందూ గుళ్ల దోపిడీయే  :. .

ప్రభుత్వానికి  à°¶à±à°°à±€ పీఠాధిపతులు పరిపూర్ణానంద హెచ్చరిక 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS ,

బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 10 ,2020 (డి ఎన్ ఎస్) : లక్షలాది మంది భక్తుల ఇలవేల్పు గా కొలువబడుతున్న శ్రీ వరాహ లక్ష్మి నృసింహుని సింహాచల క్షేత్రం

పవిత్రతను పరిరక్షించేందుకు సింహగిరి చుట్టూ వేలాది భక్తులతో గిరి ప్రదక్షిణ చేస్తామని శ్రీ పీఠాధిపతులు స్వామి పరిపూర్ణానంద ప్రకటించారు. మంగళవారం విశాఖ

నగరానికి వచ్చిన ఆయన నగరంలోని భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన సింహాచల క్షేత్ర వైభవాన్ని వివరించారు. శ్రీకాకుళం

నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకూ విస్తరించి ఉన్న విజయనగరం పూసపాటి వంశస్థుల ఆస్తులను సుమారు 58 వేల ఎకరాల భూములను ప్రజల కోసం ధారాదత్తం చేశారన్నారు. వారు ఏ

రాజకీయ పార్టీలో ఉన్న తమను నమ్ముకున్న ప్రజలకు అండగా, రక్షణగా నిలిచారన్నారు.

రాజుల పట్ల అవమానం మంచిది కాదు : . .

అంతటి వైభవం కల్గిన పూసపాటి రాజులూ

ఎన్నడూ హైందవ ధర్మానికి విరుద్దంగా నడుచుకోలేదని, ఎవరికీ అన్యాయం చెయ్యలేదని, ఎటువంటి ఆర్ధిక నేరాలకూ పాల్పడలేదన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ను స్థాపించిన పివిజి

రాజు తదనంతరం ఆయన కుమారులు ఆనంద గజపతి భాద్యతలు చేపట్టారని, వారి మరణానంతరం సోదరులు అశోక్ గజపతి భాద్యతలు చేపట్టారన్నారు. వీరు ట్రస్ట్ కు రెండవతరం వారు

మాత్రమేనన్నారు. అలాంటిది వారిని రాత్రికి రాత్రి తప్పించి, మూడవ తరం మహిళను చైర్మన్ గా చెయ్యడం రాజవంశీకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం చేసినట్టేనన్నారు.

తక్షణం తమ తప్పిదం తెలుసుకుని తిరిగి అశోక్ గజపతి రాజు ను ట్రస్ట్ లోకి ఆహ్వానించాలన్నారు. లేని పక్షంలో హిందూ సమాజం అంతా  à°¤à°¿à°°à°—బడే అవకాశం

ఉందన్నారు. 

 à°…శోక్ గజపతి తెలుగుదేశం ప్రతినిధిగా ఉన్నా, వారికి అన్యాయం జరిగితే, పార్టీలకు అతీతంగా ప్రజలు సహించలేకపోతున్నారంటే వారి పట్ల ప్రజల్లో

ఉన్న గౌరవం ఏంటో తెలుసుకోవాలన్నారు. 

అప్పన్న భూముల్లో చర్చి లను తొలగించాలి:. . . .

సింహాద్రినాధుని  à°•à°¿ చెందిన సింహాచలం కొండ పరిసరాల  à°­à±‚ముల్లో 25 నుంచి 30

చర్చిలు ఉన్నాయని, సింహాద్రినాధుని భూముల్లో క్రైస్తవ చర్చ్ లు ఎలావచ్చాయన్నారు. వీటిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. 

టిటిడి నుంచి సిజిఎఫ్ కు

నిధులు ఎలా  à°‡à°šà±à°šà°¾à°°à±?: . . .

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నుంచి ఏటా 50 కోట్లాది రూపాయలు కేటాయిస్తున్న కామన్ గుడ్ ఫండ్ నిధులు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో  à°‡à°¦à°¿ 20 కోట్లు

ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక దీన్ని 50 కోట్లకు పెంచారన్నారు. à°ˆ కామన్ గుడ్ ఫండ్ పై ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదని ప్రశ్నించారు. 

రాష్ట్ర బడ్జెట్

 à°²à±‹ రూ. 1,051 కోట్లు షాదీఖానాలకు కేటాయచారని , వీటిని కొత్తగా నిర్మించే మసీదులకు ఇచ్చారన్నారు. అదే ప్రభుత్వం హిందూ దేవాలయలను కూలిస్తే నోరెత్తడానికి కూడా

భయపడుతోందన్నారు. దీనికి కారణం హిందువులు ఏమీ చెయ్యలేరని ధైర్యంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలు కూల్చేస్తే నోరెత్తడానికి ప్రభుత్వ

ప్రతినిధులు మొద్దు నిద్రపోతున్నారన్నారు. 

గతం లో భారత దేశంలోని తురుష్కుల దండయాత్రలు సమయంలో హిందూ దేవాలయాల పై ఎలా దాడులు జరిగాయో ప్రస్తుతం ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైనా అలాంటి దండయాత్రలు జరుగుతున్నాయన్నారు. 

ఏ ప్రభుద్ధుడైన ఒక్కటే హిందూ గుళ్ల దోపిడీయే  :. . .

రాష్ట్రంలో

 à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°²à± మారుతున్నపుడల్లా హిందూదేవాలయేలే టార్గెట్ అవుతున్నాయి. ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని దోచుకోవడమే కాక,  à°—ుళ్లను కూడా

కూల్చేస్తున్నారన్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, బీజేపీ నగర అధ్యక్షుడు రవీంద్ర, బీజేపీ రాష్ట్ర

కమిటీ సభ్యులు డాక్టర్ కెవివి సత్యనారాయణ, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam