DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భయానక వాతావరణం లో ఎన్నికలు జరపద్దు :బీజేపీ డిమాండ్

*వాలంటీర్లను కార్యకర్తలుగా à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ మీద వదిలారు :* 

*రాక్షస పాలనపై హోమ్ శాఖకు,  à°Žà°¨à±à°¨à°¿à°•à°² సంఘానికి ఫిర్యాదు* 

*వైఎస్ జగన్ ఎన్నికల నిర్వాహకుడినిగా

మారాడు*

*పోలీసులు పార్టీ కార్యకర్తలా తయారయ్యారు.*

*ప్రతిపక్షాలను పోటీచేయనివ్వకుండా బెదిరిస్తున్నారు* 

*ప్రెస్ మీట్ లోనే బాధిత జడ్పీటిసీ

నుంచి ఫోన్ లో ఫిర్యాదులు*  

*బిజేపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మార్చి 13 , 2020 (డి

ఎన్ ఎస్) : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను స్థానిక ఎన్నికల బరిలో నిలవకుండా పోలీసులే బెదిరింపులతో భయానక వాతావరణం

సృష్టిస్తున్నారని, తక్షణం ఈ ఎన్నికలను రద్దు చెయ్యాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసారు. శుక్రవారం నగరానికి వచ్చిన

ఆయన నగర బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలను బెదిరించి, కుటుంబ సభ్యులను, అభ్యర్థులను చంపుతామని భయపెట్టి

నామినేషన్లు ఉపసరించుకునేలా చేసి , రక్షించవలసిన పోలీసులే భయంకర రాక్షసుల్లా మారిపోతాయా రన్నారు.  ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఇప్పడికే

కొందరిని నేరుగా బెదిరించి, పోటీ నుంచి తప్పుకోకుంటే అక్రమ గంజాయి రవాణా కేసుల్లోనూ, మద్యం పంపిణీ కేసులు పెట్టి నేరుగా జైలుకి పంపి జీవితాలు లేకుండా

చేస్తామని పోలీసులే బెదిరిస్తున్న ఘటనలు ప్రతి జిల్లాలోనూ ఉన్నాయన్నారు. 

మీడియా సమావేశంలోనే ఫోన్: . . .

ఎన్నికల్లో ఈ భయానకం పై కన్నా మాట్లాడుతుండగానే

గుంటూరు జిల్లా దుర్గి నుంచి బీజేపీ à°œà°¡à±à°ªà±€à°Ÿà°¿à°¸à±€ అభ్యర్థి నేరుగా కన్నాకు ఫోన్ చేసి తమకు స్థానిక ఎసై రామాంజనేయులు నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ ఆవేదన

వ్యక్తం చేసాడు. పోటీ నుంచి తప్పుకోకుంటే మద్యం రవాణా కేసు పెట్టి జైల్లో పెడతానని, అంతకి వినకపోతే సీఐ రంగం లోకి దిగి గంజాయి అక్రమ రవాణా కేసులు పెడతాడంటూ

ఫిర్యాదు చేయడం గమనార్హం. 

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో జరుగుతున్న రాక్షస పాలనపై కేంద్ర  à°¹à±‹à°®à± శాఖకు,  à°•à±‡à°‚ద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో

ప్రతిపక్షాలు ఎన్నికల్లో లేకుండా ఏక పక్షంగా ఎన్నికలు జరిపించుకునేట్టుగా ఓటర్లను బెదిరించేందుకు గ్రామ వాలంటీర్లను, వినకపోతే భయపెట్టేందుకు పోలీసులను తమ

పార్టీ కార్యకర్తల కంటే ఘోరంగా వాడుకుంటున్నారన్నారు.  

ఎన్నికల్లో ఎవరు గెలవాలి నిర్ణయించేంది ప్రజలని, వారికి ఎన్నికల్లో స్వచ్చందంగా ఓటు వేసే అవకాశం

ఇవ్వాలె తప్ప, తమకు ఓటు వెయ్యకపోతే తదుపరి నెల నుంచి  à°ªà±à°°à°­à±à°¤à±à°µ పధకాలు అన్ని నిలిపేస్తామని, గ్రామా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది నేరుగా ఓటర్లతోనే

బెదిరిస్తున్నారన్నారు. à°ˆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తానీ ఎన్నికల అధికారి అన్నట్టుగా మారాడని మండిపడ్డారు. 

ఇంతవరకూ తలెత్తిన ఘోరాలు - నేరాలు : . .

.

నామినేషన్ కు రాకుండా భౌతిక దాడులు చెయ్యడం, 

తీరా నామినేషన్లు వేస్తె. . రిటానింగ్ అధికారి ఎదురుగానే నామినేషన్ చింపడం, దాఖలు చేసినవారికి

స్క్రూటినీలో కారణాలు లేకుండా తిరస్కరించడం పైగా వారిని బెదిరించడం వంటివి చేస్తున్నారు.

ఎన్నికల కమిషన్ తన అధికారాలను ముఖ్యమంత్రి కి అప్పగించి

తప్పుకున్నారేమో అనిపిస్తోంది...

మాదృష్టికి వచ్చిన అన్యాయాలపై ఫిర్యాదుచేస్తే కనీసం పట్టించుకోవడంలేదు....

రాక్షస పాలనతోపాటు ఫ్యాక్షన్ పాలన

సాగుతోంది....

వైసిపి మాత్రమే నామినేషన్ వేయాలనే సంస్కృతి చూస్తున్నాము....

రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా డిజిపి ని పిలిచి హెచ్చరించినా à°

మార్పూ కనిపించడంలేదన్నారు. 

బెదరింపులను ఎదుర్కొని పులివెందులలో నలుగురే ఎమ్పీటీసీలకు నామినేషన్లు వేశారని, వారినీ ఇప్పుడు

బెదిరిస్తున్నారు....

వైసిపికి ఓటు వేయకపోతే పథకాలు రద్దవుతాయని వాలంటీర్లు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు.

తప్పుకోమంటూ అభ్యర్థులకు పోలీసుల నుంచి

బెదిరింపు ఫోన్ కాల్...

లేకుంటే, ఎస్.ఐ చేస్తే  2 కేసుల మద్యం తో పాటు మహిళలతో  à°ªà°Ÿà±à°Ÿà±à°¬à°¾à°¡à°¾à°²à±à°¸à°¿ వస్తుందని బెదిరింపు..

సిఐ వస్తే 30 గంజాయి పేకట్ల తో

పట్టుబడాల్సి వస్తుందని బెదరింపులు..

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam