DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భౌతిక దాడులకు దిగడం వెనుక చంద్ర బాబు కుట్రే : భాజపా.

విశాఖపట్నం, జూన్ 29, 2018 (DNS Online ): కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరలోనే నెరవేరుస్తోందనే దుర్ద తోనే తెలుగుదేశం పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీ అధినేతలు, క్యాడర్

పై భౌతిక దాడులు చేస్తున్నారని విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం ఎం ఎల్ ఏ పి. విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. శుక్రవారం నగరం లోని బీజేపీ పార్టీ కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ అనంతపురం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఒక సమావేశం నిర్వహించేందుకు వేదిక వద్దకు

చేరుకోగానే తెలుగుదేశం వస్తాదులు ఆయనపై భౌతిక దాడులు చేయడాన్ని తప్పు పట్టారు. ఈ విధాయమైన చర్యలు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కు తెలియకుండానే

జరిగాయా అని మండిపడ్డారు. అయన ఆదేశం తోనే కచ్చితంగా జరిగిందని బీజేపీ వర్గాల్లో అభిప్రాయం ఉందన్నారు. ఒక పార్టీ అధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న

ప్రాంతం లోకి ఇతర పార్టీల వారిని ఎందుకు అనుమతించారో పోలీసులే చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతమంది వచ్చి భౌతిక దాడులు చేసినా ఎదుర్కోడానికి సిద్దంగానే

ఉన్నాయన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam