DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మేయర్ సీటు బీజేపీ - జనసేన కూటమిదే: ఎమ్మెల్సీ మాధవ్

జివిఎంసి ఎన్నికల ఉమ్మడి అభ్యర్థుల జాబితా వెల్లడి. 

కలిసే ప్రచారం చేస్తాం : ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.

విశాఖపట్నం, మార్చి 14 , 2020 (డి ఎన్ ఎస్) : మహా విశాఖపట్నం మేయర్ సీటును జనసేన - భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి కైవసం చేసుకుంటారని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్

ప్రకటించారు. శనివారం బీజేపీ నగర కార్యాలయం లో జనసేన బీజేపీ సంయుక్తంగా  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ విలేకరుల సమావేశంలో విశాఖ నగరపాలక సంస్థకు పోటీ చేసే బిజెపి జనసేన ఉమ్మడి

జాబితాను విడుదల చేశారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 
రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు కలిసి పని చేస్తామనీ, కలిసి ప్రచారం

చేసి విజయం సాధిస్తామనీ అన్నారు. జగన్ సర్కారు అరాచకాలను కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తమ కేంద్ర నేతల దృష్టికి తీసుకుపోతామన్నారు. ఎన్నికల ప్రక్రియ వాయిదా

వేయాలని కోరుతామన్నారు. డబ్బు, మద్యం అధికార పార్టీకి అస్త్రాలుగా మారాయనీ, నిఘా పేరిట విపక్ష అభ్యర్థులను వేధించబోతున్నారనీ అన్నారు.

విశాఖ ఇంత అభివృద్ధి

చెందిందంటే అది కేంద్ర ప్రభుత్వం చలవేననీ, ప్రధాని మోదీ చొరవ తీసుకుని హుదుద్ తర్వాత భారీ నిధులు కేటాయింపజేశారనీ అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్

తెచ్చామన్నారు. విశాఖను దేశంలో, ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు తమవద్ద ఉన్నాయన్నారు. బిజెపి జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. కుల, ధన

రాజకీయాలు చేసే వారికి బుద్ది చెప్పాలన్నారు. జనసేన 51, బిజెపి 47 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఇరు పార్టీల నేతలూ ప్రకటించారు.

ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ

మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, రాష్ట్ర కమిటీ కార్యదర్శి కాశీరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ కెవివి సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని

ఆనంద్,  à°œà°¨à°¸à±‡à°¨ కన్వీనర్ ఎస్. విజయ్ కుమార్, ఉత్తర నియోజక వర్గ ఇంచార్జి పి ఉష కిరణ్,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam