DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవన్మరణ పోరాటం లో ప్రజాపక్షం మావైపే. .:జనసేన విజయకుమార్

పులివెందుల హత్యా రాజకీయాలను అమలులోకి తెచ్చారు. 

పోలీసులు, అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారారు 

విశాఖ ఎన్నికల్లో సాధించి తీరతాం:జనసేన

విజయకుమార్ 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 14 , 2020 (డి ఎన్ ఎస్) : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా స్థానిక ఎన్నికల బరిలో ఉన్న

అభ్యర్థులు, కుటుంబ సభ్యులు, వ్యాపారాలపై భౌతిక దాడులు చేస్తున్నప్పటికీ జీవన్మరణ పోరాటం లో ప్రజాపక్షం మావైపే ఉంటారని జనసేన ఉత్తరాంధ్ర ప్రతినిధి సుందరపు

విజయకుమార్ తెలిపారు. శనివారం బీజేపీ నగర కార్యాలయం లో జనసేన బీజేపీ సంయుక్తంగా  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ విలేకరుల సమావేశంలో విశాఖ నగరపాలక సంస్థకు పోటీ చేసే బిజెపి

జనసేన ఉమ్మడి జాబితాను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లా పులివెందుల హత్యా రాజకీయాలను అమలులోకి తెచ్చారని, అయినప్పటికీ అభ్యర్థులు ఎన్నికల

బరిలో నిలుస్తున్నారన్నారు. ప్రజా రక్షణ కల్పించవలసిన పోలీసులు, ఎన్నికలు నిర్వహించవలసిన అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి, ఎన్నికలను భయంకరంగా

మార్చారని మండిపడ్డారు. 

తమ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ బృందం రేణిగుంటలో ప్రచారానికి వెళ్లడంతో శుక్రవారం రాత్రి స్థానిక పోలీస్

స్టేషన్ ఎదుటే, వీరిపై అధికార పార్టీ కి చెందిన గూండాలు భౌతిక దాడులు దాడులు చేస్తున్న పోలీసులు నోరెత్తలేదంటే ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ రాష్ట్రంలో ఎన్నికలు

జరుగుతున్నాయో తెలుస్తోందన్నారు.  à°Žà°¨à±à°¨à°¿ హత్య రాజకీయాలు చేసినా తాము పోరాటం చేసి, విశాఖ ఎన్నికల్లో సాధించి తీరతామని తెలిపారు. 

ఏపిలో జగన్ తన ఇష్టం

వచ్చినట్లు ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఇదే తమ వ్యూహమనుకుంటున్నారనీ, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమనీ అన్నారు. నామినేషన్ల దశలోనే ప్రత్యర్ధులను

అడ్డుకుంటున్నారు. నామినేషన్ల సమయంలో à°­à°¯ పెడుతున్నారు. కుటుంబ సభ్యులను ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలు ఎలాగైనా గెలవాలనుకుంటున్నారు‌. దీన్ని

ఎదిరించి తీరుతాము.చివరకు ఓటర్లను కూడా ఓటు వేయనిస్తారో లేదో తెలీదు. అధికార పార్టీ మందు, డబ్బూ ముందే పోగేసుకుని కూర్చుంది. మేము నీతీ నిజాయితీలే ఆయుధాలుగా

ప్రజాస్వామ్యబద్ధంగా పోటీకి దిగుతున్నాము - అని ఆయన స్పష్టం చేశారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో వైకాపా అభ్యర్ధుల విజయానికి అక్రమ మార్గాల ద్వారా పని

చేయటం విచారకరమన్నారు. 

ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, రాష్ట్ర కమిటీ కార్యదర్శి కాశీరాజు,

రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ కెవివి సత్యనారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్,  à°œà°¨à°¸à±‡à°¨ నేతలు ఉత్తర నియోజక వర్గ ఇంచార్జి పి ఉష కిరణ్, బి, రఘు, తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam