DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక పని మొదలు పెడితే చివరి దాకా వెళ్తా: జనసేనాని పవన్ కళ్యాణ్

à°’à°•à°°à°¿ స్థాయిని కించపరచను : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  

గౌరవించేది దేశభక్తులని. . . ఎన్నుకునేది నేరస్తులనా . . 

పిడుగు పడినా ధైర్యంగా నిలబడగలిగే

వాడు కావలి . .

ఏడేళ్లు నిలబడ్డాం అంటే  à°à°¡à± దశాబ్దాలు నిలబడగలం. .

రాజమండ్రి లో జనసేన 7 à°µ ఆవిర్భావ సభలో వెల్లడి . . .   

(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి :). . .

అమరావతి  , మార్చి 14 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : పది మంది ఆలోచనశక్తిని సరైన దిశలో పెట్టగలిగిన వాడే నాయకుడని  à°œà°¨à°¸à±‡à°¨ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో శనివారం నిర్వహించిన జనసేన పార్టీ 7 వ ఆవిర్భావ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

 à°Žà°ªà±à°ªà±à°¡à±ˆà°¨à°¾ à°’à°• పని మొదలు పెడితే చివరి దాకా వెళ్తా పోరాటం సాగించేందుకేనని తెలిపారు. చిన్న తనం నుంచి ప్రతి విద్యార్థి గౌరవించేది దేశభక్తులని అని, అయితే ఓటు

హక్కు వచ్చాక ఎన్నుకునేది నేరస్తులను, నేర చరిత్ర ఉన్నవాళ్ళని ఎన్నుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. తానూ చిన్న స్థాయి నుంచి ప్రస్థానం మొదలు పెట్టానని,

ఎంతోమంది అభిమానులు ఉన్నా నేటికీ అదే స్థాయి కొనసాగుతున్నానని తెలిపారు. ఎన్నటికీ తానూ ఒకరి స్థాయిని కించపరచనని, వాళ్ళు ఎంత ఉన్నత స్థాయి లో విజయం

సాధించగలరన్నారు. ఇది ఎన్నో సార్లు సమాజంలో నిరూపితమైందన్నారు. 

ఐదేళ్లు ఎన్నో సినిమాలు వరుసగా విజయం సాధించిన తరువాత కూడా పదేళ్ల కాలం పాటు ఒక్క హిట్ కూడా

లేని గడ్డు పరిస్థితి ని కూడా ఎదుర్కొన్నానన్నారు.  
 
2014 లో పార్టీ పెట్టినప్పుడు, ఎప్పుడు ప్రతి కూల పవనాల్లోనే పని చేశానన్నారు. నా వెనుక రాజకీయ నేపథ్యం లో

రాలేదు. ఒక ప్రాంతం లోని నాయకులూ, మరొక ప్రాంతం వాళ్ళని నిర్లజ్జగా తిద్దుతుంటే తట్టుకోలేక పోయా. అందుకే పార్టీ పెట్టానన్నారు. పిడుగు పడినా కూడా తట్టుకుని

నిలబడగలిగిన వాడే నాయకుడు అన్నారు. 

ఈ సభల్లో జనసేన నేతలు నాదెళ్ల మనోహర్, కె. నాగేంద్రబాబు, శివ శంకర్, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు

పాల్గొన్నారు. 

అంతకు ముందు తూర్పుగోదావరి జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుండి  à°®à°§à±à°°à°ªà±‚à°¡à°¿ విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

స్వాగతం పలికిన జనసేన జనసేన నాయకులు. అభిమానులు. రోడ్డు మార్గాన రాజమండ్రి బయలుదేరి వెళుతున్నారుతూర్పుగోదావరి జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుండి

 à°®à°§à±à°°à°ªà±‚à°¡à°¿ విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. స్వాగతం పలికిన జనసేన జనసేన నాయకులు. అభిమానులు. రోడ్డు మార్గాన రాజమండ్రి బయలుదేరి

వెళుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam