DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొవిడ్‌ -19 - 31 వరకు తెలంగాణలో స్కూళ్లు,థియేటర్లు మూసివేత

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 14 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్‌ -19 కేసులు దేశంలో చాపకిందనీరులా

విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలకు దిగింది. జనసందోహాలు లేకుండా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ

ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను à°ˆ నెలాఖరు వరకు మూసివేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీ దేశంలో

కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించింది. అనంతరం రాష్ట్రంలో à°ˆ వైరస్‌ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు

తీసుకుంది. రాష్ట్రంలో వివిధ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని మాత్రం యథాతథంగా కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ను

మూసివేయాలని à°ˆ సమావేశంలో నిర్ణయించారు. అలాగే, శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను సైతం కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి à°ˆ నెల 20 వరకు à°ˆ సమావేశాలు జరగాల్సి

ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహించి.. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం తెలిపిన అనంతరం సభను

నిరవధికంగా వాయిదా వేయనున్నారు.  

మరోవైపు, దేశంలో కరోనా  à°¬à°¾à°§à°¿à°¤à±à°² సంఖ్య 83కు చేరింది. à°ˆ మహమ్మారి సోకి ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు à°ˆ వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam