DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ఎన్నికల అభ్యర్థుల పై దాడికి వైకాపా పార్టీకి సంబంధం లేదు*  

*విశాఖలో మేయర్ సహా, 98 సీట్లు మా పార్టీ వే. . .* 

*ఎన్నికలు ఎప్పుడు జరిగినా అన్ని స్థానాలు మేమె గెలుస్తాం*  

*అధిక సీట్లను ఏకగ్రీవం చేసేందుకు కృషి చేస్తాం. .

. .* 

*ఎన్నికలు రద్దు అంటే పెళ్లి రద్దు లాంటిదే : , , ,*

*వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  à°…ధికార ప్రతినిధి గుడివాడ అమర్* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 15 , 2020 (డి ఎన్ ఎస్) : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల నామినేషన్ల పర్వం లో అభ్యర్థులు, వారి పార్టీల వారిపై జరిగిన దాడికి

తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ ప్రకటించారు. ఆదివారం విశాఖపట్నం లోని

నగర పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నామినేషన్లు, ఫైలింగ్ ప్రక్రియ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రశాంతం గా

జరిగాయని, అధికారులు, పోలీసులు చాలా చక్కగా విధులు నిర్వహించారని కితాబు ఇచ్చారు. సాధారణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీయే స్థానిక ఎన్నికల్లోనూ

గెలుస్తుందని, అలాగే ప్రస్తుతం జరగవలసిన ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందన్నారు. అదే విధంగా అధిక స్థానాల్లో ఏకగ్రీవానికి కృషి

చేస్తామని తెలిపారు. 

ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ 19 ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేశారన్నారు. ఇంతవరకూ

ఎన్నికలకు  à°¸à°‚బంధించి ఎక్కడి వరకు  à°ªà±à°°à°•à±à°°à°¿à°¯ జరిగిందో, మిగిలిన ప్రక్రియ అక్కడ నుంచి యధావిధిగా  à°œà°°à±à°—ుతుందన్నారు. 

ఎన్నికలు రద్దు అంటే పెళ్లి రద్దు

లాంటిదే : , , ,

ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి, మరొకసారి నోటిఫికేషన్ నుంచి మొదలు పెట్టాలి అంటే ఒక పెళ్లి రద్దు లాంటిదేనన్నారు. ఒక ఇద్దరికీ పెళ్లి కుదిరి, పీతల

దాకా వచ్చిన తర్వాత అనివార్య కారణాల వాళ్ళ à°† పెళ్లి అప్పడికి నిలిచి పొతే. . .అప్పడికి వాయిదా వేసి,  à°®à°°à±‹ అనుకూల తేదీ ని మార్చుకుంటారన్నారు. అంటే కానీ à°† పెళ్లి రద్దు

చెయ్యారన్నారు. ప్రస్తుతం ఎన్నికల వాయిదా  à°•à°¾à°•à±à°‚à°¡à°¾ ప్రతిపక్షాలు కోరుతున్నట్టు రద్దు చెయ్యడం కూడా 
పెళ్లి రద్దు లాంటిదేనన్నారు. 

 

భూములకు రక్షణ

కల్పిస్తాం : . . . 

విశాఖలో తన భూములను అధికార పార్టీ కబ్జా చేసిందంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర 
అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన అభియోగాలను

అమర్నాధ్ ఖండించారు. ఇలాంటిది జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని, అయితే విశాఖ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఏ పోలీస్ స్టేషన్ లోనూ కన్నా ఫిర్యాదు

చెయ్యలేదని పోలీస్ అధికారులే చెప్పారన్నారు. ఆయన భూములు పై ఆరా తీస్తే రక్షణ గోడ కట్టి చక్కగా భద్రంగా ఉందన్నారు. 

విశాఖ రాజధానిగా ప్రకటించిన తరవాత

తెలుగుదేశం, జనసేన, ఇప్పుడు భాజపా పెద్దలు విమర్శలు, నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా చేసినప్పుడు వైకాపా

అడ్డుకుంది. ఈ ప్రాంత ప్రజల భూములు మేము కాపాడుతున్నాము.

ఆరేళ్లలో ఆరు పార్టీలతో పొత్తులు - à°’à°• రికార్డు 

జనసేన ఆరు సంవత్సరాలలో ఆరు పార్టీలతో పొత్తు

పెట్టుకున్న రికార్డ్ ఘనత సాధించిందన్నారు. అదే విధంగా ఒక పార్టీ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో రెండు చోట్ల ఓడిపోయిన రికార్డ్ కూడా జనసేన అధ్యక్షుడు పవన్

కళ్యాణ్ సాధించారన్నారు. శనివారం పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. à°ªà°µà°¨à± కళ్యాణ్ నేరగాళ్ల కు ఓటేస్తారా అనే ప్రశ్నకు ప్రజలు సమాధానం చెప్పారన్నారు. అందుకే 2019లో

ప్రజలు జనసేనకు ఓటు వెయ్యలేదన్నారు. పవన్ కళ్యాణ్ à°•à°¿ పవర్ స్టార్ కాదు పిరికి స్టార్ అని పెరు పెట్టాలని, అదే ఇతనికి సరిగ్గా సరిపోతుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam