DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి పై భక్తులకు అంతరాలయం దర్శనం రద్దు, ఈఓ

*కేవలం శీఘ్ర దర్శనమే. . సామూహిక పూజలు రద్దు*

*సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ లు ధరించాల్సిందే. .*

*కేశఖండన, అన్న సత్రాల్లో డెట్టాల్ నీళ్లతో

కడుక్కోవాలి.* 

*పిల్లలు, వృద్దులు ఆలయ దర్శనం వాయిదా వేసుకోవాలి* 

*కరోనా ప్రభావాన్ని కొండపైకి రానివ్వకుండా ఈఓ చర్యలు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS ,

బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 16 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కరోనా ప్రభావం తగ్గేవరకూ  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్రా జిల్లాల ఆరాధ్యదైవమైన సింహాచల క్షేత్రంలో భక్తులకు అంతరాలయం

లో దర్శనం ఉండదని కార్యనిర్వహణ అధికారి ఎం. వెనకటేశ్వర రావు ప్రకటించారు. కరోనా ప్రభావం సింహాచల క్షేత్రం పై చూపకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలయ అర్చకులు,

ఇతర సిబ్బంది కి సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రధానమైన సూచనలు చేసారు. పెద్ద సంఖ్యలో భక్తులను ఒకే చోట నిలువకుండా ఉండే విధంగా ఆలయంలో త్వరిత గతిన దర్శనం

చేయించాలన్నారు. అంతరాలయం దర్శనం రద్దు చేసి, కేవలం లఘు దర్శనం మాత్రమే అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కువ మంది పాల్గొనే సామూహిక సహస్రనామ పూజలను రద్దు చేసారు.

విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాల్సిందేనాని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే కేశఖండన శాల, అన్న సత్రాల్లో డెట్టాల్ నీళ్లతో

కడుక్కునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.  à°ˆ మేరకు ఆయన సూచించిన నిబంధనలు ఇవే: 

ఆలయానికి వచ్చే భక్తులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. 
కేవలం పది

నిమిషాల్లో à°—à°¾ స్వామి దర్శనం చేసుకుని ఆలయం నుంచి బయటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు 
అంతరాలయ దర్శనం పూర్తిగా రద్దు చేశారు కేవలం లఘు దర్శనం మాత్రమే

అమలులో ఉంది 

కరోనా తీవ్రత తగ్గే వరకు à°ˆ లఘుదర్శనం అమలు లో ఉంటుందని వెంకటేశ్వరరావు తెలిపారు 

భక్తులు చేసుకునే సహస్రనామార్చన సేవ చేశారు 

రాజ

భోగ సమయాన్ని ప్రస్తుతం అమలు చేస్తున్న à°—à°‚à°Ÿ సమయం కు బదులుగా కేవలం ఇరవై నిమిషాలకి పరిమితం చేశారు.  à°¤à°¦à±à°µà°¾à°°à°¾ భక్తులు దర్శనం వేగవంతం చెయ్యడానికి నిర్ణయం

తీసుకున్నారు 

à°† సమయంలో ధ్వజస్తంభం వద్ద ఉచిత సర్వదర్శనం భక్తులను ఉత్తరద్వారం వద్ద నిలిపి వేయడం జరుగుతుంది 

ప్రముఖుల సందర్శన పర్యటన సమయంలో కేవలం

దర్శనం మాత్రమే చెయ్యాలని తీర్మానించారు. 

విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ తప్పనిసరిగా రావలసిందిగా ఆదేశించారు 

శ్రీ వారి దేవస్థానం లో భక్తుల రద్దీ

à°—à°¾ ఉండే అన్న ప్రసాద కేంద్రం క్యూలైన్లు ఎప్పటికప్పుడు డెటాల్ క్లోరిన్ వాటర్ తో శుభ్రం చేసుకునే ప్రక్రియ తీసుకొచ్చారు 

ఈ మేరకు మార్పులను భక్తుల

అందరికీ తెలిసే విధంగా ప్రకటనలు చేస్తున్నారు 

ఆలయ ప్రాంగణంలో పరిసరాల్లోని మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరచి నీరు నిలవకుండా ఉండేవిధంగా

పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు.

 à°­à°•à±à°¤à±à°²à°•à± ప్రత్యేక సూచనలు చేస్తున్నారు 12 ఏళ్లలోపు పిల్లలు 60 ఏళ్లు దాటిన ఆలయాలకు రావడం తాత్కాలికంగా వాయిదా

వేసుకోవాల్సి కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam