DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించండి

*రాజ్యసభ రైల్వే మంత్రికి విజయసాయి రెడ్డి వినతి* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 16 , 2020 (డి ఎన్ ఎస్) : విశాఖపట్నం కేంద్రంగా

ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసిన త్వరతగతిన కార్యకలాపాలు ప్రారంభించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యులు

వి.విజయసాయి రెడ్డి కోరారు.  à°¸à±‹à°®à°µà°¾à°°à°‚ రాజ్యసభ జీరో అవర్‌లో రైల్వే మంత్రి ని ఆయన కోరారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో

పొందుపరచిన హామీలలో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగానే విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను

ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి à°—à°¤ ఏడాది ఫిబ్రవరి 27à°¨ అధికారికంగా ప్రకటించారు. à°ˆ ప్రకటన వెలువడి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త రైల్వే జోన్‌

కార్యకలాపాలు ఆరంభం కాలేదని అన్నారు. కొత్త రైల్వే జోన్‌ వలన అనేక పోర్టులు కలిగిన ఆంధ్రప్రదేశ్‌కు రైలు  à°°à°µà°¾à°£à°¾ సౌకర్యాలు మరింత మెరుగుపడటంతోపాటు, సరుకుల

రవాణా ద్వారా ఆర్థికంగా రాష్ట్రానికి ఊతమిచ్చినట్లుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభమైతే ఏటా 13 వేల కోట్ల

రూపాయల ఆదాయంతో ఇది దేశంలోనే అత్యంత లాభదాయక రైల్వే జోన్‌ అవుతుందని ఆయన చెప్పారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం వంటి పోర్టులకు సేవలందించడం ద్వారా à°ˆ

రైల్వే జోన్‌ అత్యధిక ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని అన్నారు. రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తే రాష్ట్రంలోని పరిశ్రమలు, వాణిజ్య వ్యాపారాలకు ఎంతో

ఉపయుక్తంగా ఉంటుంది. అందువలన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి సాధ్యమైనంత త్వరలో కార్యకలాపాలు ప్రారంభించవలసిందిగా ఆయన

రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam