DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధర్మ దీక్షల్లో అన్నీ అహంకార వ్యాఖ్యలే : భాజపా 

మోదీపై లోకేశ్‌ ఘాటు వ్యాఖ్యలకు భాజపా మండిపాటు 

ప్రధాని ని తిట్టాలంటే కోట్లు ఖర్చు చెయ్యాలా ? 

విశాఖపట్నం, జూన్ 29 , 2018 (DNS Online )  : సాక్షాతూ దేశ ప్రధానమంత్రి

నరేంద్ర మోడీ ని తిట్టాలి లేదా దూషించాలి అంటే కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చెయ్యాలా అని భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. శుక్రవారం కాకినాడ లో

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ధర్మ పోరాట దీక్ష పై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఎవరినైనా తిట్టాలంటే ఒక్క తిట్టు తిడితే సరిపోతుంది. కానీ ఈ రాష్ట్రం

లో తెలుగుదేశం నేతలు ఎవరినని తిట్టాలంటే కోట్లాది ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు అని వెటకారం చేశారు. అలాంటి ఈ దేశ ప్రధానిని తిట్టాలంటే ఇంకెన్ని కోట్లు ఖర్చు

చేసి ఉంటారో వాళ్ళకే తెలియాని అని బీజేపీ ఎద్దేవా చేస్తున్నారు. 

దొంగ దీక్షలా నిర్వాకం ఇదీ . . . : bjp

కొట్లాడు ఖర్చు చేసి, ధర్మ దీక్షలా పేరిట ఊరూరా తిరుగుతూ

కోట్లాదిగా ప్రజాధనం వెచ్చించి సభలు చేస్తున్నారు. దీనిపై వాళ్ళు చంద్ర బాబు నాయుడు అండ్ కో చేస్తున్న అధర్మ దీక్షలపై వివరణ ఇస్తున్నారు.  à°¦à±€à°¨à°¿ ప్రకారం వేలాదిగా

జనాన్ని బహిరంగ సభలకు ప్రభుత్వ బస్సుల్లో తరలించాలి, వేదిక పై భారీ సంఖ్యలో ఎయిర్ కూలర్లు పెట్టుకొవాలి, అవి సభ జరిగినంత సేపు నిరంతరాయ à°—à°¾  à°ªà°¨à°¿ చెయ్యడానికి

విద్యుత్ సిబ్బందిని పెట్టుకోవాలి, ప్రజలు తిరగబడితే కాపాడడానికి రక్షణ కోసం వేలాదిగా సిబ్బందిని విధుల్లో ఉంచాలి, ఆపై వందల కొద్దీ భజన పరులను పెట్టుకోవాలి,

ఆపై మాట్లాడవలసిన మైకులు ఆగి పోకుండా చూసేలా సాంకేతిక విజ్ఞాన విభాగం నిపుణులనూ, మాట్లాడే సమయంలో లైవ్ కవరేజి ఇవ్వడానికి కోట్లాది రూపాయల ప్యాకేజీలు ఇచ్చి మరీ

టీవీ చానెళ్లను తెచ్చుకోవాలి, సాయంత్రం ఎండ మీద పడకుండా పెండాళ్లు వెయ్యాలి, త్రాగడానికి అత్యంత ఖరీదైన హిమాలయ మంచి నీటి సీసాలు క్రేట్లు కొద్దీ పెట్టుకోవాలి.

తెచ్చుకున్న జనం పూర్తిగా సభా ప్రాంగణానికి వచ్చే వరకూ వేదిక ఖాళీగా ఉండకుండా మాట్లాడేందుకు కొందరు డమ్మీలను చెచుకోవాలి, ఆపై మూడు సరిచేసుకుని నోరు విప్పి

అత్యంత శక్తివంతుడైన ఈ భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తిట్టాలి. ముందుగానే మొత్తం తిట్టేస్తే జనం వెళ్లకుండా, ఒక్కొక్క హెచ్చరిక చేస్తూ ఉంటె... జనం

కాసేపైనా వేదిక వద్ద నిలబడి ఉంటారు. అంటే నరేంద్ర మోడీ ని నిందించాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు చెయ్యాలన్న మాట. ఇదే విషయం ఈ రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖామంత్రి

à°ˆ అత్యున్నత సార్వత్రిక సర్వ సత్తాక ప్రజాస్వామ్య దేశ ప్రధానిని బహిరంగంగా తిట్టడానికి ఇంత ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ  à°®à±à°‚దుగా సాధన చేసిన అన్ని తిట్లూ

తిట్టలేక పోయినట్టున్నారు అని భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. 

 à°ªà±ˆ పరిపాలనా తెలియని మంత్రి లోకేష్ తన స్తాయిని మరిచి హెచ్చరించడాన్ని భారతీయ

జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారు. శుక్రవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో  à°ªà±à°°à°œà°¾ ధనం తో తెలుగుదేశం చేస్తున్న అధర్మ ( దొంగ) దీక్షలను ప్రజలు

నమ్మడం లేదని తెలుసుకున్న లోకేష్ ప్రధానమంత్రిని తిడితే ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే లక్ష్యం తో ఆంధ్ర వాళ్ళతో పెట్టుకుంటే మాడి మసై పోతారు అని

వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. లోకేష్ స్తాయి ఏంటో కూడా అతనికే తెలియదని, అలాంటిది దేశ సర్వోన్నత పాలకుని ఇష్టానుసారంగా నోటికి వచ్చిన వ్యాఖ్యలు

చెయ్యడం పైగా, అదే సభలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం వారించడం కూడా చెయ్యక పోవడం చూస్తే తెలుగుదేశం పార్టీ కోట్లాది రూపాయల ప్రజాధనం తో ఏర్పాటు

చేసేవి తమ పార్టీ ప్రచార కోసమేనని మరోసారి రుజువైందన్నారు. గత సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం నరేంద్ర మోడీని నోటికి వచ్సిన దూషణలు చెయ్యడం గమనార్హం.

అప్పుడు కూడా చంద్రబాబు అక్కడే ఉన్నా ఖండించలేదు, ప్రజల్లో వచ్చిన భయంకర ఒత్తిడిని తట్టుకోలేక రెండు వారాల తర్వాత సద్ది చెప్పుకున్నాడు హిందూపురం ఏం ఎల్ ఏ 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam