DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంప్రదాయాన్ని పాటిస్తే భయానక వైరస్ లు కూడా దూరమే: చిన్న జీయర్

*సనాతన హిందూ ధర్మం ఏనాడో రక్షణ కవచాలు అందించింది.* 
 
*శుచి, శుభ్రత, మడి, ఆచారం మన ఆరోగ్యం కోసమే. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

సూర్యాపేట /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, మార్చి 17 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : సనాతన హిందూ సంప్రదాయాన్ని పాటిస్తే కరోనా వైరస్ కంటే  à°­à°¯à°¾à°¨à°• వైరస్ లు కూడా దూరం అవుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక

వేత్త త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. మంగళవారం సూర్యాపేట లోని మేళ్లచెరువు లోని మై హోమ్ సంస్థల ఆధ్వర్యవం లో నిర్వహించబడుతున్న శ్రీ భూ సమేత శ్రీ

వెంకటేశ్వర స్వామి ఆలయ 22 వ బ్రహ్మోత్సావాలలో పాల్గొన్న ఆయన భక్తులనుద్దేశించి, మంగళాశాసనం అనుగ్రహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మం

అందించిన ప్రతి అంశం లోనూ ఒక మంచి సందేశం ఉంటుందన్నారు. ఇళ్లలోనూ, గుళ్ళలోనూ, తెల్లవారు ఝామునే. . . తుడుచుకోవడం, పసుపు నీళ్లు జల్లడం, ఆవు పేడతో అలకడం వంటి వాటి

ద్వారా, ఎటువంటి బ్యాక్టీరియా, వైరస్ లు దరి చేరవన్నారు. అదే విధంగా శుచి, శుభ్రత, మడి తదితర సంప్రదాయ ఆచారాలు మన ఆరోగ్యం కోసమే చెప్పడం జాగిరిందన్నారు.

ఎప్పడికప్పుడు ఆహారం తయారు చేసుకోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన పదార్థం వంటబట్టి, మనిషికి శక్తి వస్తుందన్నారు. అలా కాకుండా ముందు రోజు

వండుకుని తినడం ద్వారా ఆ పదార్థం లో పోషక విలువలకు బదులుగా బ్యాక్టీరియా చేరి కూర్చుంటుందన్నారు. ఆలయాల్లో నైవేద్యం అనేది మూడు పూటలా పెట్టడం జరుగుతుందని,

అంటే ఆ సమయానికి వండి, ఆరాధనలో ఉంచడం జరుగుతుందన్నారు. దానిని తిరిగి భక్తులకే వితరణ చేస్తారన్నారు. ఏ పదార్ధమైన వేడిగా , స్వచ్చంగా ఉన్నదే ఎటువంటి అనారోగ్య

సమస్యలూ రావన్నారు. అలాగే మన భారతీయ సంప్రదాయంలో ఎదుటి వారికి నమస్కారంతోనే గౌరవించడం, అభివాదం చెయ్యడం జరుగుతుందని, తద్వారా బ్యాక్టీరియా ఇద్దరి మధ్య

ప్రసరించే అవకాశం లేదన్నారు. 

అలాగే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవడం, తద్వారా ఉదయాన్నే వచ్చే సూర్యరశ్మిని ఆస్వాదించడం ద్వారా విటమిన్ డి ని

పొందవచ్చన్నారు. అయితే ప్రస్తుత తరుణంలో సూర్య భగవానుడు శుభోదయం చెప్పిన గంటకి చాలా మందికి మేల్కొంటున్నారన్నారు. తద్వారా ప్రకృతి నుంచి వచ్చే అత్యంత విలువైన

పోషకాన్ని కోల్పోయారన్నారు.   

అదే విధంగా ఎదుటి మనిషిని గట్టిగా పట్టుకుని తాకడాలు మన సంప్రదాయం కాదన్నారు. శుచి శుభ్రత తో పాటు, ఇద్దరి లో ఎవరికీ అనారోగ్యం

ఉన్నా, మరొకరికి ప్రసరించడం జరుగుతుందన్నారు. ఇది ఎవరికీ మంచిది కాదన్నారు. వేదం కూడా ఇదే విషయాలను తెలియచేస్తోందన్నారు. ఇప్పుడు కరోనా వైరస్ ప్రపంచాన్ని

వణికిస్తున్న తరుణంలో హిందూ సనాతన పద్దతులను అవలంభిస్తున్నారన్నారు. ఇదే విషయం మన ధర్మం కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పించాడన్నారు. వాటిని పాశ్చాత్యులు

బాగా వంటబట్టించుకుని, వాటిని వారు యధాతధంగా అమలు చేసుకుంటున్నారన్నారు. ఇప్పడికైనా మన సంప్రదాయ విధి విధానాలను అమలు చెయ్యడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని

సాగించుకోవచ్చన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam