DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు కెవివి

*వైఎస్ జగన్ ప్రభుత్వానికి సుప్రీం మరో మొట్టికాయ.* 

*ఎన్నికల నిర్వహణ పై ఈసీ దే తుది నిర్ణయం:* 

కోర్టు తీర్పు ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్

తప్పుపట్టగలదా?   

ప్రజల ఆరోగ్యం కంటే పదవి దాహమే ఎక్కువగా ఉంది 

బీజేపీ రాష్ట్ర  రాష్ట్ర కమిటీ సభ్యులు, డాక్టర్ కెవివి  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£ 

*(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 18 , 2020 (డి ఎన్ ఎస్) : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్ర

ప్రదేశ్ కమిషన్ ఆరు వారాలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధించడాన్ని స్వాగతిస్తున్నట్టు భారతీయ జనగర పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు,

న్యాయవాది డాక్టర్ కెవివి  à°¸à°¤à±à°¯à°¨à°¾à°°à°¾à°¯à°£ ప్రకటించారు. బుధవారం భారత్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వైఎస్ జగన్ ప్రభుత్వానికి à°’à°• గుణపాఠం లాంటిదన్నారు. రాష్ట్రంలో

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి, క్రింది స్థాయి కార్యకర్తల వరకూ స్థానిక ఎన్నికలను తక్షణం నిర్వహించాలంటూ ఎన్నికల కమిషనర్ ను బహిరంగంగానే

దూషించడం క్షమించరాని నేరం à°—à°¾ అభివర్ణించారు. వీరికి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కంటే పదవి దాహమే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోందన్నారు. 
కరోనా వైరస్ ( కోవిడ్ 19 )

ప్రభావంతో దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే. . ఆంధ్ర లో మాత్రం అధికార పక్షం చాలా తేలిగ్గా తీసుకుందన్నారు. ప్రజలు ప్రభుత్వ ప్రకటనలపై పూర్తిగా

తప్పుపట్టిన పట్టింపులేదన్నారు. గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతలు ఎవరు విలేకరుల సమావేశం నిర్వహించినా స్థానిక

ఎన్నికల వాయిదా పై ఎన్నికల కమిషనర్ ను నిందించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. 

అయితే బుధవారం సుప్రీం కోర్టు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని

సమర్ధించడం తో సుప్రీం ను కూడా నిందించగలరా అని డాక్టర్ సత్యనారాయణ అధికార పార్టీని  à°ªà±à°°à°¶à±à°¨à°¿à°‚చారు. 

స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 

ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం à°ˆ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నిక కోడ్‌

ఎత్తివేయాలని సూచించింది. 

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ప్రధానమైనవి:  à°•à±‹à°µà°¿à°¡à± ప్రభావం తో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం సమంజసమే.

ప్రసుత అత్యయిక పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నిబంధనలు సడలించవచ్చు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నివహించాలి అనే విషయం లో తుది నిర్ణయం మాత్రం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దేనన్నారు. అమలు లో ఉన్న ప్రభుత్వ పధకాలను అమలు చేసుకోవచ్చు. అయితే కొత్తగా ఎటువంటి పధకాలను ప్రవేశ పెట్టరాదు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam