DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో 31 నుంచి పదో తరగతి పరీక్షలు యథాతధం: మంత్రి సురేష్

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 19 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : ఆంధ్ర ప్రదేశ్ ని విద్యార్థులకు అన్ని సౌకర్యాల కల్పన లతో ఇంటర్

పరీక్షలు, పడవ తరగతి పరీక్షలు జరుగుతాయని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రస్తుతం విద్యా సంస్థలకు ముందస్తు జాగ్రత్తగా సెలవలు

ప్రకటించామన్నారు. సెలవలు కేవలం హాస్టళ్లు, కళాశాలలకు మాత్రమేనన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని పాఠశాలలు,

కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు మూసివేత నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ రోజు ఆయన అమరావతిలో

మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అయితే పదో తరగతి పరీక్షలు ఈనెల 31 నుంచి యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అలాగే ఇంటర్ పరీక్షలు కూడా ఈనెల 23వ తేదీలోగా

పూర్తికానున్నట్లు చెప్పారు. సెలవుల కారణంగా విద్యార్థులు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. à°ªà°¦à±‹ తరగతి పరీక్షలు రాసే

విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య సౌకర్యం అందజేస్తున్నామన్నారు. సెలవుల

విషయంలో ఈనెల 31వ తేదీ తర్వాత పరిస్థితిని మరోసారి సమీక్షించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam