DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల మార్గాలు మూసివేత- భక్తులకు నో ఎంట్రీ

*నడకదారి, అలిపిరి ఘాట్ రోడ్ లు అన్నీ మూసివేత*

*కాశి నుంచి వచ్చిన భక్తునికి కరోనా ఖరారు తో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిర్ణయం.* 

*తిరుమల లో భక్తులను ఖాళీ చేయించి తిరుపతికి

తరలింపు*   

*à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిర్ణయం తో బెంబేలెత్తుతున్న భక్తులు, 

*భక్తుల రక్షణ కోసమే à°ˆ నిర్ణయం : à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చైర్మన్ సుబ్బారెడ్డి* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS ,

బ్యూరో , విశాఖపట్నం). . .*

తిరుమల /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, మార్చి 19 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : తిరుమల చరిత్రలో మొట్టమొదటి సారిగా భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. వారణాసి కాశి నుంచి వచ్చిన

భక్తునికి కరోనా ఖరారు కావడం తో తిరుమల తిరుపతి దేవస్థానం ( టిటిడి ) హఠాత్తుగా నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే మార్గాలన్నింటినీ తక్షణం మూసివేసేందుకు

ఆదేశాలు జారీ చేశారు. అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు, చంద్రగిరి మార్గం తదితర నడక మార్గాలతో సహా, అలిపిరి టోల్ గేట్ నుంచి వెళ్లే మార్గాన్ని కూడా మూసివేశారు.

భక్తుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం టైం స్లాట్ ద్వారా స్వామి దర్శనం చేయిస్తున్నామని, అయితే

గురువారం ఒక భక్తునికి కరోనా బయట పడడంతో ఈ నిర్యాణం తీసుకున్నట్టు తెలిపారు. స్వామికి ఆరాధనలు కేవలం అర్చకులు మాత్రమే జరిపిస్తారని, భక్తులను ఎట్టి

పరిస్థితుల్లోనూ అనుమతించమని తెలిపారు. ఇది కేవలం భక్తుల రక్షణ కోసమేనన్నారు. టిటిడి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భక్తులు సహకరించాలని కోరారు. ఇప్పడికే తిరుమల లో

ఉన్న భక్తులను గదులను ఖాళీ చేయించి తిరుపతికి తరలిస్తున్నారు. తక్షణం తిరుమల ఖాళీ చెయ్యాలని, ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ను  à°µà±à°¯à°¾à°ªà±à°¤à°¿ చెందకుండా జాగ్రత్తలు

తీసుకుంటున్నామన్నారు. 
దీంతో తిరుమల నుంచి కొండా క్రిందకు చేరుకోడానికి అత్యధిక బస్సులను, ప్రయివేట్ వాహనాల ద్వారా తరలిస్తున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam