DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎట్టకేలకు.  .8 ఏళ్ళ తర్వాత . ఉరి. . .జరిగేనా? 

*ఒక అబలకు న్యాయం చెయ్యడానికి ఇన్నేళ్ళ?*
 
*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 19 , 2020 (డి ఎన్ ఎస్) : ఎట్టకేలకు నిర్భయ దుర్ఘటన కేసులోని

నలుగురు దోషులను శుక్రవారం తెల్లవారుజామున 5. 30 గంటలకు ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు తుది ఏర్పాటు చేస్తున్నారు. ఘటన జరిగిన ఏడున్నరేళ్ళ తర్వాత కిరాతక

దోషులకు శిక్ష అమలు కానుంది. ఇప్పడికే దేశ వ్యాప్తంగా వీళ్ళ చర్యను చీదరించుకుంటే ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేస్తుంటే. . . కేవలం ఒక్క న్యాయవాది మాత్రం వీళ్ళని

ఎట్టిపరిస్థితుల్లోనూ ఉరికంబం ఎక్కనివ్వనూ అంటూ ఏకంగా బాధితురాలి తల్లికే సవాల్ విసరడం చాలా బాధాకరం. కేవలం ఒక అబల కు న్యాయం చేయమంటూ యావత్ దేశం మొత్తం కోర్టు

వెంట బడితే. . . చట్టం లో ఉన్న లోపాల కారణంగా దాదాపు ఎనిమిదేళ్ల కాలం సాగదియ్యబడింది. మూడు సార్లు ఉరి కూడా ఖరారు అయినా తర్వాత చివరి నిమిషంలో ఆగిపోయిన ఘటనకు

దేశంలోని ప్రజలకు à°ˆ దేశంలోని న్యాయస్థానాలు, చట్టాల మీద గౌరవం కూడా పోయిన మాట వాస్తవం.  à°†à°–à°°à°¿à°•à°¿ బాధితురాలి కుటుంబ సభ్యులు విసిగి పోయి à°ˆ దేశ న్యాయస్థానాన్ని

చీదరించుకునే స్థితికి చేర్చింది à°ˆ దేశ చట్టం.  

తీహార్ జైల్లో. . . :

జైలు నంబర్ 3లో నిర్భయ హంతకులు ముకేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను

శుక్రవారం తెల్లవారుజామున 5. 30 గంటలకు ఒకేసారి ఉరితీసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బుధవారం ఉరితీసే చోట డమ్మీ బొమ్మలతో ఉరితీసే ప్రక్రియ

నిర్వహించినట్లు జైలు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం మూడవ నంబర్ జైలులోని ఉరితీసే ప్రదేశాన్ని తలారి పవన్ జల్లద్‌తోసహా జైలు అధికారుల బృందం తనిఖీ చేసింది.

బీహార్‌లోని బుక్సర్ నుంచి తెప్పించిన పది తాళ్లతో ఉరితీత ప్రక్రియను నేటి సాయంత్రం చివరిసారి అధికారులు పరీక్షించనున్నారు. 
ఉత్తర్ ప్రదేశ్ జైళ్ల శాఖకు

చెందిన మీరట్ నివాసి పవన్ జల్లద్‌ను ఉరితీత కోసం అధికారులు ప్రత్యేకంగా రప్పించారు. ఒక్కో ఉరికి పవన్‌కు రూ.15,000 జైలు అధికారులు చెల్లించనున్నారు. తీహార్ జైలులో

ఒకేసారి నలుగురు ఖైదీలను ఉరితీయడం ఇదే మొదటిసారని అధికారులు తెలియచేస్తున్నారు. à°‰à°°à°¿à°¤à±€à°¸à±‡ సమయంలో పవన్‌తోపాటు జైలు సూపరింటెండెంట్, జైలు డాక్టర్ వంటి కొద్ది

మంది అధికారులు మాత్రమే హాజరుకానున్నారు. నలుగురు దోషులతో జైలు సూపరింటెండెంట్ ఈరోజు సాయంత్రం మాట్లాడి వారి చివరి కోరిక తెలుసుకోనున్నారని తీహార్ జైలు

అధికారి ఒకరు చెప్పారు. తమ కుటుంబ సభ్యులకు ఉత్తరం రాయడం వంటి చివరి కోరికలు ఏమైనా ఉంటే నెరవేర్చడం జరుగుతుందని ఆయన వివరించారు. జైలుకు చెందిన కౌన్సెలర్ల చేత

నిర్భయ దోషులకు కౌన్సెలింగ్ ఇప్పించడం ఇప్పటికే పూర్తయిందని ఆయన తెలిపారు. 
శుక్రవారం ఉదయం 6.30 గంటలకల్లా ఉరితీత కార్యక్రమం పూర్తవుతుందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం ఈ నలుగురు దోషులను మూడవ నంబర్ జైలులోని ఉరితీసే ప్రాంతానికి సమీపంలో ఉంచారు. వీరిని విడివిడిగా ఉంచారు. ఒక్కో ఖైదీని కనీసం 2-3 వార్డెన్లు గస్తీ కాస్తూ

వారి ప్రతి చర్యను గమనిస్తున్నారు. బుధవారం వరకు à°ˆ నలుగురు దోషులలో ఎటువంటి భయాందోళన కనపడలేదని, కాని గురువారం ఉదయం నుంచి వారు తమ సెల్‌లోనే à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾

గడుపుతున్నారని మరో జైలు అధికారి చెప్పారు. ఇటీవలి వరకు వారు ఉరిశిక్ష ఖైదీల్లా లేరని, రెండుసార్లు ఉరితీత వాయిదాపడడంతో వారిలో భయమనేది కనపడలేదని ఆయన

వివరించారు. తమ చివరి కోరికగా నిర్దిష్టంగా వారు ఏదీ చెప్పలేదని, వారి మానసిక ఆందోళన కాని భయం కాని కనపడడ లేదని ఆయన చెప్పారు. అయితే బుధవారం రాత్రి నుంచి వారి

ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. జైలు గార్డులతో కూడా వారు ముభావంగా ఉంటున్నట్లు తెలిసిందని ఆ అధికారి చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam