DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరిపైకి భక్తులకు నో ఎంట్రీ. . సేవలు ఏకాంతమే 

భక్తుల రక్షణ కోసమే నిబంధన: ఈఓ వెంకటేశ్వర రావు 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 19 , 2020 (డిఎన్ఎస్) : కరోనా వైరస్ ప్రబలకుండా

శుక్రవారం నుంచి సింహాచలం ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదని సింహాచల క్షేత్ర కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర రావు ప్రకటించారు. గురువారం ఆలయ అనువంశిక

ధర్మకర్త / చైర్మన్ సంచయిత గజపతిరాజు అధ్యక్షతన  à°œà°°à°¿à°—à°¿à°¨ ధర్మకర్తల మండలి సమావేశంలో శుక్రవారం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించరాదని నిర్ణయించడం

జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనల మేరకు ఆలయం లోకి భక్తులను అనుమతించడం లేదని, సేవలన్నీ కేవలం ఏకాంతంలోనే అర్చకులు నిర్వహిస్తారన్నారు.

ఇప్పడికే ఆలయ పరిధిలోని కేశఖండన శాలను మూసివేయడం జరిగిందని, అన్న ప్రసాద కేంద్రంలో కేవలం ప్రసాద వితరణ మాత్రమే చేపడుతున్నారు. గురువారం నిర్వహించిన అత్యవసర

సమావేశంలో ఆలయం లో కేవలం అర్చకులు మాత్రమే ఉంటారన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఆలయంలోకి భక్తులను అనుమతి లేదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam