DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హమ్మయ్య అడ్డంకి లేకుండా ఉదయం 5:30 కి వేసేసారు.

అర్ధరాత్రి 2 :30 గంటలకు కూడా ఆఖరి అవకాశం వదల్లేదు 

సర్వత్రా ఉత్కంఠ. .అనంతరం హర్షం. . .

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 20 , 2020

(డి ఎన్ ఎస్) : ఎట్టకేలకు శుక్రవారం (మార్చి 20 , 2020 ) ఉదయం 5 :30 గంటలకు తీహార్ జైలు నెంబర్ 3 లో నిర్భయ ఘటనలో నలుగురు మానవ మృగాలకు ఉరి శిక్ష అమలు చెయ్యడంతో దేశవ్యాప్తంగా హర్షం

వ్యక్తమవుతోంది. ఎనిమిదేళ్ల తర్వాత à°ˆ మృగాలకు శిక్ష అమలు చెయ్యడం పై దేశవ్యాప్తంగా హర్షం వెల్లువవుతోంది. ఆఖరికి శుక్రవారం అర్ధరాత్రి 2 :30  à°—ంటలకు కూడా సుప్రీం

కోర్టు తలుపులు తట్టి ఇంకా జీవించేందుకు దోషుల తరపు లాయరు విశ్వ ప్రయత్నం చేశారు. దేశ రాజధానిలో కరోనా ప్రభావంతో నిబంధనలు ఉన్నప్పడికి, ప్రజలు భయపడకుండా తీహార్

జైలు బయట ఉరి వార్త వినేందుకు ఎదురు చూసారు. తలరి పవన్ జల్లాద్ ఈ నలుగురికి ఉదయం 5 గంటలకు నల్ల ముసుగు వెయ్యడంతో ఉరి ఖరారు అని తేలిపోయింది. ఉదయం 5 :30 గంటలకు ఉరి వేసినా,

అరగంట తర్వాత 6 గంటలకు జైలు అధికారులు, వైద్యులు వీళ్ళ మరణాన్నిధృవీకరించారు. జైలు నిబంధనల ప్రకారం తదుపరి కార్యాచరణ జరుగనుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam