DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆఖరి క్షణం . . . తీహార్ జైలు 3 వ గది

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 20 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో నిర్భయ దోషులకు అధికారులు ఉరి

శిక్ష అమలు చేసారు. పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్ à°•à°¿ తీహార్ జైల్లో ఉరి శిక్ష అమలు చేశారు. ఉత్తరప్రదేశ్ à°•à°¿ చెందిన 
తలరి  à°ªà°µà°¨à± జలాద్ వారిని

ఉరి తీశారు. గురువారం రాత్రి ఉరి శిక్ష అమలు చేసే ప్రాంతాన్ని అధికారులు పక్కాగా పరిశీలించారు. దోషులకు అన్ని, న్యాయ, రాజ్యాంగ అవకాశాలు పూర్తి అయ్యాయి. నిర్భయ ఘటన

జరిగిన 8 ఏళ్ళ తర్వాత ఉరి శిక్షను అమలు చేశారు.

ఉరి కంభం వద్ద 48 మంది భద్రతా సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. జైలు నెంబర్ 3న నలుగురు నిందితులను ఉరి తీశారు

అధికారులు. ఒక్కో దోషి వద్ద 12 మంది గార్డులు ఉన్నారు. ఉదయం నాలుగు గంటలకు అల్పాహారం పెట్టి, వారికి వైద్య పరిక్షలు నిర్వహించారు. శిక్షకు ముందు వినయ్ శర్మ భోరున

విలపించాడు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి నలుగురు నిందితులు చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశారు.

నలుగురు నిందితులను ఒకే సారి ఉరి తీశారు. దీనిపై యావత్

దేశం హర్షం వ్యక్తం చేసింది. అర గంట వరకు నిందితులు ఉరి కంభాలకు వేలాడారు. నిందితులను ఉరి తీయడంతో తీహార్ జైలు బయట మహిళలు, సామాజిక కార్యకర్తలు సంబరాలు

చేసుకుంటున్నారు. నిర్భయ తల్లి తండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళకు తమ అమ్మాయికి న్యాయం జరిగిందన్నారు. ఇక వారికి శవ పరీక్ష నిర్వహించి కుటుంబ

సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. అయితే కుటుంబ సభ్యులు స్పందించక పోవడం గమనార్హం. లేనిపక్షంలో జైలు నిబంధనల ప్రకారం తదుపరి కార్యాచరణ చేపట్టడం

జరుగుతుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam