DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లాలో కరోనాపై సమరానికి సిద్ధం.: కలెక్టర్  

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 20, 2020 (డి ఎన్ ఎస్) : శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన

చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. జిల్లాలో ఇప్పటికే ఇంటింటి సర్వేను చేపట్టి 96 శాతం గృహాలలో సర్వే పూర్తి చేసారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖతోపాటు అన్ని శాఖల

అధికారులను ముఖ్యంగా సంబంధిత మత్స్యశాఖ, పంచాయతీ, నగరపాలక సంస్ధ, మునిసిపల్ శాఖలను పూర్తి అప్రమత్తం చేసారు. జిల్లాకు ఇతర దేశాల నుండి వచ్చిన వారిపై నిఘా పెడుతూ

వారి కదలికలను గమనిస్తున్నారు. 

శుక్ర వారం నాటికి 238 మంది స్వీయ గృహ నిర్భందంలో ఉన్నారని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఎక్కవ మంది ప్రజలు ఒక చోట

గుమిగూడ రాదని, వేడుకలు ఉంటే వాయిదా వేసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండి రేయింబవళ్లు పరిస్ధితిని సమీక్షిస్తుందని ప్రజలు

పూర్తిగా సహకరించాలని కోరారు. జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడిని సురక్షితంగా ఉంచాలనే ధ్యేయంతో పనిచేస్తున్నామని చెప్పారు. కరోనా నియంత్రణలో రాష్ట్రం

ఆదర్శప్రాయంగా ఉందని అన్నారు. 

శ్రీకాకుళం జిల్లా వాసులు కష్టపడి పనిచేసే తత్వం కలవారని కరోనా నివారణలోనూ ఆదర్శప్రాయంగా ఉండాలని కోరారు. తప్పనిసరి

పరిస్ధితుల్లో వైద్య సేవలు అందించుటకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 90 బెడ్లను ఐసోలేషన్ వార్డులలో ఏర్పాటు చేసామని తెలిపారు. జిల్లా నుండి ముగ్గురు

వ్యక్తులకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలకు పంపించామని, మూడు రిపోర్టులు నెగిటివ్ గా వచ్చిందని పేర్కొన్నారు. మత్స్యకారులు కూడా కరోనాకు గురి అయ్యే అవకాశం

ఉండటంతో మత్స్యశాఖను అప్రమత్తం చేసి వారి వివరాలు సేకరించి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. వ్యాధి భారీన పడిన వారికి వైద్య సేవలు అందించే

పరిస్ధితుల్లో వైద్యులు, సేవలు అందించే వారు పూర్తి స్ధాయిలో సురక్షిత చర్యలు తీసుకోవాలని సూచించామని, ఆసుపత్రి వ్యర్ధాలను సురక్షితంగా విసర్జన చేయుటకు

బ్లీచింగు, హైపో క్లోరైడ్ సొల్యూషన్ వినియోగించాలని స్పష్టంగా తెలియజేసామని చెప్పారు. పారిశుధ్య కార్మికులు ప్రమాదాల్లో పడే అవకాశం ఉందని గుర్తించి పలు

సూచనలు చేసామని అన్నారు. ఆసుపత్రి వ్యర్ధాలను తీసేటపుడు విధిగా బ్లీచింగు, హైపో క్లోరైడ్ సొల్యూషన్ వినియోగించి ఉండాలని, అలా వినియోగించని వ్యర్ధాలను తీయరాదని

సూచించామని చెప్పారు. వీధుల్లో చెత్తను సైతం తొలగించుటకు సురక్షిత చర్యలు చేపట్టాలని సూచించామని తెలిపారు. 

తగిన పాదరక్షలు, దుస్తులు, చేతి గ్లోవ్సు

ఉపయోగంచాలని అన్నారు. శానిటైజర్లను ప్రతి ఆసుపత్రి, కార్యాలయంలో ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆసుపత్రిలోకి ప్రవేశించే ముందుగా శానిటైజేషన్

చేసుకోవాలని సూచించారు. వ్యాధి లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొంటూ వైరస్ సోకిన 14 రోజుల వరకు సాధారణంగా ఉంటుందని అన్నారు. 14 రోజుల తరువాత మొదటి

మూడు రోజుల వరకు సాధారణ జ్వరం, జలుబు, దగ్గు ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. రోజు వారీ మార్పులను గమనించాలని అన్నారు. గొంతు నొప్పి, జ్వర తీవ్రత, తలనొప్పి,

తిన్నప్పుడు, తాగినప్పుడు గొంతులో నొప్పి, ఒల్లు, కీళ్ళ నొప్పులు, గొంతు నొప్పితోపాటు దగ్గు, నీరసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం, వాంతులు, విరేచనాలు

వంటి లక్షణాల ఉంటాయని, జాప్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. భయాందోళనలు లేకుండా ... ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam