DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి: అవంతి 

*విశాఖ ఎయిర్ పోర్ట్ లో మంత్రి ఆకస్మిక తనిఖీలు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 21 , 2020 (డి ఎన్ ఎస్): ప్రజలందరూ అనుక్షణం

అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం విశాఖ పట్నం విమానాశ్రయం లో ఆకస్మిక తనిఖీలు చేశారు.

కరోనా నేపథ్యంలో యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల వివరాలు, ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్న వారి వివరాలు

సేకరించి ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలన్నారు. ఎయిర్ పోర్ట్ లో వైద్య తనిఖీలు నిర్వహించేందుకు గాను నిపుణులైన వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు.

ప్రయాణికులు కూడా యంత్రాంగానికి సహకరించాలన్నారు. ముందుగా ఆయన ధర్మల్ సెన్సార్ మీటర్ తో శరీర ఉష్ణోగ్రపాట ను పరీక్ష చేయించుకున్నారు.  à°•à°°à±‹à°¨à°¾ నియంత్రణకు

ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ప్రజలు భయాందోళనకు గురి కావద్దని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam