DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర పరిక్రమ చేసిన సబల స్వాతి కి ఘన స్వాగతం.

విశాఖ లో పుట్టడానికి రాసి పెట్టి ఉండాలి : స్వాతి 

విశాఖపట్నం, జూన్ 30 , 2018 (DNS Online ) : సాగర తీరనగరం విశాఖపట్నం లో జన్మించడం పూర్వజన్మ సుకృతమని, ఐ ఎం ఎస్ వి తరిణి నౌక పై

సుమారు 254 రోజుల పాటు సాగర పరిక్రమ చేసిన నావికా దళ లెఫ్టనెంట్ పి. స్వాతి తెలిపారు. ఐ ఎన్ ఎస్ వి తరిణి నౌక పై మరో ఐదుగురు మహిళా నావికాదళ సిబ్బంది తో కలిసి సాగర యానాం

చేయడం జీవితంలో మరపురాని విజయమన్నారు. యాత్ర పూర్తి చేసుకుని విధుల్లో చేరిన తదుపరి తొలిసారి విశాఖ నగరానికి చేరుకున్న ఆమెకు విశాఖ విమానాశ్రయం లో విశాఖ

పశ్చిమం నియోజక వర్గం ఎం ఎల్ ఏ పి జి వి ఆర్ నాయుడు ( గణబాబు), స్తానిక చైతన్య మహిళా కళాశాల విద్యార్థినులు, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గణబాబు

మాట్లాడుతూ నగరానికి చెందిన యువతి, నావికాదళం లో చేరడం ఒక సాహసం అయితే, దాన్ని మించి, సాగర జలాలపై సుమారు 254 రోజుల పాటు నౌకాయానం చేసి విజయవంతంగా యాత్ర చేయడం

అంతకంటే ఘన విజయం అన్నారు. ఈమె స్ఫూర్తిగా యువతీ యువకులు తమ లక్ష్య సాధనను ఛేదించాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో విశాఖ వాసులు తనకు స్వాగతం పలకడానికి విశాఖ

విమానాశ్రయానికి రావడం ఎంతో ఆనందాన్ని కల్గించిందని, తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు ఆనందభాష్పాలు వచ్చాయి. తనను ఆదరించిన విశాఖ ప్రాంతానికి, నగర వాసులకు

ధన్యవాదములు తెలిపారు. 

సాగర పరిక్రమ జరిగిన విధానం ... : 

కేవలం ఆరుగురు భారత నావికా దళ మహిళా సిబ్బంది సుమారు 254 రోజుల పాటు సాగర జలాల్లో అత్యంత ప్రమాదకర

ప్రయాణం సాగించి తిరిగి గోవా చేరుకున్న ఐ ఎన్ ఎస్ తరిణి బృందాన్ని భారత రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ అభినందించారు. భారత నావికా దళానికి చెందిన కేవలం ఆరుగురు

మహిళా సిబ్బంది ఈ నౌక లో సుదీర్ఘ ప్రయాణం సాగించి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని క్షేమంగా తిరిగి భారత తీరానికి చేరుకున్నారు. ఈ బృందం లో విశాఖ కు చెందిన

లెఫ్టనెంట్ కమాండర్ పి. స్వాతి కూడా ఉన్నారు.  à°®à±‡ 21 à°¨ సాయంత్రం గోవా తీరానికి చేరుకున్న à°ˆ మహిళా బృందానికి భారత నావికాదళంనుంచి ఘన స్వాగతం లభించింది. à°ˆ బృందానికి

లెఫ్టనెంట్ కమాండర్ వాటికా జోషి నాయకత్వం వహించగా, ఐదు దేశాల్లో మాత్రమే à°ˆ తరిణి నౌక విశ్రాంతి తీసుకుంది. మిగిలిన బృంద సభ్యులు లెఫ్టనెంట్  à°•à°®à°¾à°‚డర్ ప్రతిభా

జంవాల్, లెఫ్టనెంట్ కమాండర్ పి. స్వాతి, లెఫ్టనెంట్ ఐశ్వర్య బోడపాటి, లెఫ్టనెంట్  à°Žà°¸à±. విజయ దేవి, లెఫ్టనెంట్ పాయల్ గుప్తా లు సభ్యులుగా ఉన్నారు. వీరు ప్రయాణించిన

నౌక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫాక్లాండ్ ఐలాండ్, సౌత్ ఆఫ్రికా, మారిషస్ దేశ తీరాల్లో మాత్రమే విశ్రాంతి తీసుకుని, అక్కడి నావికా దళ అధికారులు, సిబ్బంది తో

సమావేశమయ్యారు. వీరు ప్రయాణించిన ప్రతీ ప్రాంతం లోనూ ఎంతో సాదర స్వాగతం లభించింది. ఈ యువ మహిళలు చేస్తున్న అత్యంత సాహసోపేతమైన ప్రయాణం ఎందరికో స్ఫూర్తి

కలిగిస్తుందని ఆయా దేశాల ప్రతినిధులు కొనియాడారు. ప్రయాణానికి ముందుగా ఈ బృంద సభ్యులు భారత ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసి, తమ యాత్ర విషయాలను వివరించారు. వీరి సహస

యాత్ర కు అయన ముగ్దులై విజయంగా యాత్రను పూర్తి చెయ్యమని అభినందించారు.  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 10 2017 à°¨ గోవా లోనే మొదలైన వీరి సహస యాత్రకు రక్షణ మంత్రి జెండా ఊపి శ్రీకారం

చుట్టారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam