DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా వ్యాప్తి పై పూర్తి స్థాయి నిరోధానికి భారత్ సై  

*భారతీయ రైల్వే ప్రయాణీకుల సేవలు బంద్*

*మార్చి 31 వరకూ రవాణా మినహా అన్నిరైళ్లకు విరామం.*

*విమాన సేవలు ఇప్పడికే బంద్, ఇక రైల్వేలు. .* 

*రైల్వే నిర్ణయం

పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం*   

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 22 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా వ్యాప్తి పై పూర్తి స్థాయి

నిరోధానికి భారత్ దేశం సిద్దపడి అన్ని ముందస్తు చర్యలూ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరు వరకూ అన్ని విమాన సేవలనూ ఇప్పడికే నిలిపివేసింది. సోమవారం నుంచి

పూర్తి స్థాయిలో భారతీయ రైల్వే ప్రయాణీకుల రైళ్లను సేవలు పూర్తి నిలిపివేస్తున్నట్టు భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటించింది. ప్రధానంగా విదేశాల నుంచి భారత్

కు వస్తున్నా ప్రయాణీకుల్లో కరోనా బాధితులు వారి గమ్య స్థానాలకు రైళ్ల ద్వారానే చేరుకుంటుండడం గమనార్హం. ఇటీవల వెలుగు చూసిన పాజిటివ్ కేసుల్లో దాదాపు రైళ్లలో

ప్రయాణించిన వారే అధికంగా ఉండడంతో ఢిల్లీ ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి రైల్వే అధికారుల సమావేశంలో ప్రభుత్వం తక్షణం ప్రయాణీకులను తీసుకు వెళ్లే అన్ని తరహాల

రైళ్లను ఈ నెలాఖరు వరకూ నిలిపి వెయ్యాలని నిర్ణయించింది. అయితే శనివారం వివిధ స్థానాల నుంచి బయలు దేరిన రైళ్లు వాటి గమ్య స్థానాలకు చేరిన తర్వాత అవికూడా

నిలిచిపోతాయి. ఇక ఈ నెల 31 వరకూ భారతీయ రైల్వే లో ప్రయాణించిన ప్రయాణికుల్లో పాజిటివ్ ఉన్న వారి వివరాలు సేకరించి, వారు ప్రయాణించిన బోగిల్లోని ఇతర ప్రయాణీకుల

జాబితాను సేకరించి, వైద్య పరీక్షలు జరిపేందుకు రైల్వే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పడికే విధి నిర్వహణలో ఉన్నారు. 

పూర్తి స్థాయి ప్రక్షాళన చేసేటప్పుడు

కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రజలు కొంచెం సంయమనం వహించాలని అధికారులు పిలుపునిస్తున్నారు. 

భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భారత వాసులు హర్షం

వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి ప్రక్షాళన కోసం తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు పలు స్వచ్చంద సేవా సంస్థలు ముందుకు రావడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam