DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా ని అదుపు చెయ్యడానికి వరాహ అవతారం అవసరం 

*హిరణ్యుడి తరహాలోనే ఉంది కరోనా,à°† మట్టు పెట్టాల్సిందే.* 

*మడి, ఆచారం, శుచి, శుభ్రత తప్పక పాటించాలి.* 

*నిబంధనలు పటిష్టంగా పాటించండి: చిన్న జీయర్

స్వామి* 

*ఏప్రిల్ నెలాఖరు వరకూ కచితంగా నిబంధనలు పాటించాలి..* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

శంషాబాద్ /  à°µà°¿à°¶à°¾à°–పట్నం, మార్చి 22 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :

ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కరోనా ను కంట్రోల్ చెయ్యడానికి వరాహ అవతారం మరొకసారి రావాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చిన్న జీయర్

స్వామి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా స్వచ్చంద నిర్బంధం పాటిస్తూ సాయంత్రం 5 గంటలకు అభినందనల

పూర్వక చప్పట్లను తెలియచేసారు. తెలంగాణలోని శంషాబాద్ లో గల జీయర్ ఆశ్రమం లో ఆయన జనతా కర్ఫ్యులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పురాణాల్లోని కనిపించే

రాక్షసుడు హిరణ్యాక్షుడు నాడు తన దుష్ట ప్రవర్తన తో భూమిని త్రిప్పినట్టుగా, కరోనా ప్రస్తుతం ఇబ్బంది పెడుతోందన్నారు. ఆ రాక్షసుణ్ణి మట్టు పెట్టడానికి శ్రీమహా

విష్ణువు వరాహ స్వామి అవతారంలో వచ్చి ఈ విశ్వాన్ని రక్షించారన్నారు. ప్రస్తుతం రూపం మార్చుకుని కరోనా రూపంలో హిరాణ్యాక్షుడే వచ్చాడా

అనిపిస్తోందన్నారు. 

అయితే దీని ప్రభావం తగ్గించుకోడానికి ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటిస్తూ, ఇష్ట దైవ ప్రార్ధనలు

చేయాలన్నారు. 

మన హైందవ సంప్రదాయం సూచించినట్టు ప్రక్క వారికి కనీస దూరం లో ఉండాలని, మన సంప్రదాయం ప్రకారం కేవలం నమస్కారం మాత్రమే చేయాలన్నారు. శుచి , శుభ్రత,

మడి ఆచారం తప్పకుండా పాటించాలన్నారు. వచ్చే నెల వళరకూ మనం కచ్చితంగా నిబంధనలు పాటించవలసి రావచ్చన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam