DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇదీ మా భారతీయం. .చప్పట్లతో మారు మ్రోగిన భారతావని

*విశాఖ శారదాపీఠంలో ఘంటానాదం: . . .*

*ధన్యవాద శబ్దాలతో మారు మ్రోగిన విశాఖ నగరం* 

*5 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్ వాసుల్లో పెల్లుబికిన ఆనందం*

*(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 22 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ఒక్కరోజు స్వచ్చంద కర్ఫ్యూ పాటించమని దేశ

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ వాసులు సంపూర్ణంగా అమలు చేసారు. సామాన్యుల నుంచి, సన్యాసులు, పీఠాధిపతుల వరకూ ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా తమ

నివాసాలకు పరిమితమయ్యారు. 

విశాఖ పట్నం జిల్లా ప్రధమ పౌరులు కలెక్టర్ వి. వినయ్ చాంద్ కుటుంబ సభ్యులు తమ గృహం లోను, విశాఖ శ్రీ శారద పీఠాధిపతులు

విశాఖపట్నంలోని తమ ఆశ్రమం లోను, అపార్ట్మెంట్ లు అధికంగా ఉండే బాలయ్యశాస్త్రి లే అవుట్ ప్రాంతంలోని అపార్ట్మెంట్ ల వాసులు పెద్ద సంఖ్యలో ఆదివారం సాయంత్రం

ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్ల తోనూ, కంచాలు, ప్లాట్లు పై శబ్దం చేస్తూ, శంఖు నాదాలు, గంటల మ్రోగిస్తూ, బాజాలు వాయిస్తూ తమ రక్షణకు శ్రమిస్తున్న వివిధ ఆసుపత్రుల

వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, అధికారులు, మీడియా వారికి ధన్యవాదములు తెలియచేసారు. 

విశాఖ శారదాపీఠంలో ఘంటానాదం: . . .

విశాఖ శారదాపీఠం

ఘంటానాదంతో మార్మోగింది. పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాల్లో ఒకేసారి గుడిగంటలు మోగించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపఁనందేంద్ర,

స్వాత్మానందేంద్ర స్వాములు మేధా దక్షిణామూర్తి మండపంలో పూజలు చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీఠంలోని ఆలయాలను దర్శించి దేవతామూర్తులకు

హారతులిచ్చారు. కరోనా ప్రభావం నుంచి యావత్ ప్రపంచం బయటపడాలంటూ పూజలు చేసారు. విశాఖ శారదాపీఠంలో విద్యాభ్యాసం సాగిస్తున్న వేద విద్యార్థులంతా గుడి గంటలు

మోగించారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam