DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కారణం లేకుండా రోడ్డుపైకి వస్తే వేటు తప్పదు: సీఎస్ సోమేశ్ 

*ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పూర్తి ఆంక్షలు*

*31 వరకూ నిబంధనలు కచ్చితంగా అమలు : డిజిపి మహేందర్*  

*ప్రజల్లో భాద్యతరహితం ఉంది, ప్రమాదాన్ని

అడ్డుకోవాల్సిందే* 

*ప్రజల తీరుపై ఆగ్రహించిన ఉన్నతాధికారులు, ఆజ్ఞలు జారీ* 

*తెలంగాణ ప్రజలకు సీఎం, డీజీపీల హెచ్చరికలు జారీ* 

*(DNS రిపోర్ట్ : రాజా పి,

స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 23 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు లో ఉందని, ప్రజలు రోడ్లపైకి రాకూడదని ప్రధాన

కార్యదర్శి సోమేశ్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం జనతా కర్ఫ్యూ తర్వాత సోమవారం ఉదయం భారీ సంఖ్యలో రోడ్లపైకి జనం రావడంతో ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి

మహేందర్ రెడ్డి లు మండిపడ్డారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తక్షణం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టు

ప్రకటించారు. 

రాష్ట్ర ప్రజల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. కరోనా వైరస్ నియంత్రణకై ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గుంపులు గుంపులుగా జనం తిరుగుతున్నారని, వైరస్ ను వ్యాప్తి

చెందకుండా ప్రజలను అప్రమత్తం చేస్తుంటే. . .వాళ్ళు మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. రోడ్డుపైన జనం కనపడితే కఠిన చర్యలు తీసుకుంటామని

హెచ్చరించారు. 

బయట తిరిగే వాహనాలు తక్షణం సీజ్, : డిజిపి. . . 

ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని డిజిపి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఇంటి నుంచి బయటకు

ఎవ్వరూ రాకూడదని, విరామం ఇచ్చినప్పుడు మాత్రం కేవలం తమ కోలనీ దాటి వెళ్ళడానికి అనుమతి లేదన్నారు. ఎవ్వరు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రోడ్లపైకి

ఎటువంటి వాహనం రావడానికి అనుమతి లేదని, వచ్చిన వాహనాన్ని తక్షణం సీజ్ చెయ్యడం జరుగుతుందని, వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజల రక్షణ కోసం

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాల్సిదేనన్నారు. 

అయితే, ప్రభుత్వ ప్రకటనను ప్రజలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఇష్టారీతిన

రోడ్లపై సంచరిస్తున్నారు. గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నారు. లాక్‌డౌన్‌ పట్టించుకోకుండా ప్రజలు రోడ్లపైకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్

నిబంధనలను పాటించని వారిపై కేసుల నమోదుకు ఆదేశాలు జారీచేశారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రజాహితానికై చేపట్టిన బంద్‌కు

సహకరించాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam