DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా కట్టడికి విష్ణు సహస్రనామ పారాయణ,  పాల్గొన్న వేలాది మంది భక్తులు

*విశ్వ శాంతి కోసం చిన్న జీయర్ స్వామి ఆదిత్య హృదయ పారాయణలు*

*ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా పీడ నశించాలని కోరుతూ. .*

*వేల సంఖ్యలో ఇళ్ల నుంచే పారాయణలో

పాల్గొన్న భక్తులు* 

*శంషాబాద్ ఆశ్రమం నుంచి లైవ్ స్ట్రీమ్ లో పారాయణ*

*విశాఖ, రాజమండ్రి, బెంగుళూరు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచీ*     

*(DNS రిపోర్ట్

: సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 24 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి ని విస్తరించకుండా, కరోనా సహా, ఇతర విష జ్వరాల

పీడ నుంచి à°ˆ ప్రపంచం రక్షింపబడాలని కాంక్షిస్తూ  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°•à°¤ పరంగా అందరూ తమవంతు ప్రార్ధనలు చెయ్యాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చిన్న జీయర్‌ స్వామి

పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం శంషాబాద్ లోని జీయర్ ఆశ్రమం నుంచి స్వామిజి youtube ద్వారా శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణ ను నిర్వహించారు. ఆన్ లైన్ ద్వారా

సాగిన à°ˆ మహా యజ్ఞం లో వేలాదిగా భక్తులు తమ ఇళ్ల నుంచే పాల్గొన్నారు. 

వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న భక్తులు:. . .

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ,

రాజమహేంద్రవరం, ఏలూరు, బెంగుళూరు, చెన్నై, విజయవాడ, నెల్లూరు, శంషాబాద్, తదితర తెలుగు ప్రాంతాల నుంచే కాక, అన్ని జిల్లాల నుంచి, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి

స్వామిజి శిష్యులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యక్రమం లో పాల్గొన్నారు.  à°ˆ పారాయణ లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ బాల బాలికలు, మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో

పాల్గొన్నారు.   

రాత్రి సమయం అయినప్పడికి ( వారి దేశాల కాలమానం ప్రకారం ) అమెరికా, కెనడా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి విదేశాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో ఈ

ఆన్లైన్ పారాయణలో పాల్గొన్నారు. అనంతరం ఆయా దేశాల నుంచి విశ్వ శాంతి ని కాంక్షిస్తూ సందేశాలను పంపడం గమనార్హం. 

ముందుగా కరోనా చేస్తున్న విలయ తాండవాన్ని

వివరిస్తూ . . . మానవ తప్పిదానికి ప్రమాదాలు ఎంత విపరీతంగా ఉంటాయో ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. దీని తక్షణం అరికట్టవలసిన ఆవశ్యకత ఉందని, దీనికి మానవ కృషి కి

దైవ సహకారం తోడు కావాల్సిన అవసరం ఉందన్నారు. 

శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్ర వైభవాన్ని వివరిస్తూ. . . సమాజం నుంచి కరోనా సహిత, అన్ని తరహాల విష జ్వరాలు, వైరస్ లు, ఇతర

గ్రహ పీడల బారినుంచి ఈ ప్రపంచం రక్షించబడాలని కాంక్షిస్తూ శ్రీ లక్ష్మి అష్టోత్తర నామ, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సామూహికంగా నిర్వహించారు. ఈ పారాయణ

జరుగుతున్నంత సేపు దివ్య సంకేతం లోని శ్రీరామచంద్ర స్వామికి విశేష ఆరాధనలు చేపట్టారు. 

శ్రీవిష్ణు నామ పారాయణ తదుపరి సూర్య భగవానుని అనుగ్రహం కోసం ఆదిత్య

హృదయ పారాయణ నిర్వహించారు.  

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం లేనందున à°ˆ పారాయణ ను ఇంటర్నెట్ ద్వారా యూట్యూబ్ ఛానల్ లోని  JET WORLD  à°à°¡à°¿  à°¦à±à°µà°¾à°°à°¾ ప్రసారం

చేస్తున్నామని,  à°µà±‡à°²à°¾à°¦à°¿ మందితో ఆన్ లైన్ లో శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నట్టు తెలియచేసారు. యావత్ భారత దేశమంతా లాక్ డౌన్ చేసినందున, ప్రతి ఒక్కరూ తమ

ఇళ్లలోనే ఉండి, ఈ మహా యజ్ఞం లో పాల్గొనాల్సిందిగా చిన్న జీయర్ స్వామి పిలుపునిచ్చారు. స్వామిజి పిలుపుకు వేలాదిగా భక్తులు స్పందించి, భారత దేశం లోనే కాక,

విదేశాల్లోని భక్తులు సైతం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

ప్రభుత్వానికి సహకరించండి : చిన్న జీయర్ . . .

ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న

చర్యలకు దేశ ప్రజలందరూ సహకరించాలని సూచించారు. ప్రజలందరూ స్వచ్చందంగా ఇళ్లకే పరిమితమవ్వాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని సూచించారు. ఈ

వైరస్‌ దేశ విదేశాల్లో విపరీతంగా ఉన్నందున భారత దేశంలో వ్యాప్తికి  à°•à°Ÿà±à°Ÿà°¡à°¿ చేసేందుకు భారత ప్రధాని నేరుగా పిలుపు నిచ్చారన్నారు. 

ఈ నెల 31 వరకూ స్వచ్చందంగా

కర్ఫ్యూ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. 

తెలంగాణ లోని శంషాబాద్ లో à°—à°² జీయర్ ఆశ్రమం లోని దివ్య సంకేత ఆలయంలో జరిగిన  à°ˆ శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ లో

 à°šà°¿à°¨à±à°¨ జీయర్ స్వామి తో పాటు త్రిదండి రామానుజ దేవనాధ జీయర్ స్వామి, వేదవిద్యార్థులు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam