DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏయూకు పాలక మండలి సభ్యుల నియామకం పూర్తి 

అధికార పార్టీ విధేయులకే ఎయు ఈసీ లో చోటు? 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మార్చి 23 , 2020 (డి ఎన్ ఎస్) : ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పాలక

మండలి ఏర్పాటు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. అయితే అధికార పార్టీకి విధేయులుగా ఉన్న వారికే పాలక మండలి లో చోటు

లభించడం గమనార్హం. 

గతం లోనూ నియమించబడిన పాలక మండలి సభ్యులను అధికార పార్టీ కి విధేయులుగా ఉన్నవారికే లభించేవి, అయితే, పార్టీ విధేయతను బహిరంగంగా

ప్రదర్శించేవారు కాదు. నేడు ఏకంగా ఉప కులపతి హోదా ఉన్నవారు సైతం నేరుగా అధికార పార్టీ కార్యక్రమాల సంబరాల్లో ( ఎయు పరిధిలో ) పాల్గొనడం ఎన్నో విమర్శలకు

తావిస్తోంది.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ ఉపకులపతి హోదాలో అధ్యాపకులు నేరుగా ప్రస్తుత అధికార పార్టీ నేతృత్వం లో జరిగిన యువభేరి లో ప్రత్యక్షంగా పాల్గొనడంతో విచారణ కమిటీ ని

సైతం ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అనంతర కాలం నాటి ప్రతిపక్ష పార్టీ అధికారం లోకి రావడంతో పార్టీ కార్యకలాపాలను ప్రశ్నించే వారే లేకుండా పోయారు. 

నేడు

జరిగిన నియామకాల్లో సైతం అధికార పార్టీకి ఎంతో కొంత విధేయత లేకపోతె పదవి వచ్చే అవకాశమే లేదని సాక్షాత్తు ఎయు ఉన్నతాధికారులే వెల్లడించడం శోచనీయం. ఒక విశ్వ

విద్యాలయం అభివృద్ధి చెందడానికి మంచి సలహాలు ఇవ్వాలంటే ఆ సభ్యులు విద్యా వంతుడు, విజ్ఞాన వంతుడు అవ్వాలా? లేక పాలక పార్టీ విధేయులు కావాలా అనేది

తెలియకుండాపోతోంది. అయితే నేడు నియమితులైన వారు స్వతహాగా విద్యావంతులు కావడం గమనార్హం. అయితే వీరికి ఈ పదవి లభించింది వారి విద్యార్హత పై కాకుండా పార్టీ విధేయత

పై అంటూ ముద్ర వెయ్యడం విచార à°•à°°à°‚. 

గత పాలక మండలి పదవీ కాలం పూర్తయిన నేపధ్యంలో నూతన ప్రభుత్వం కొత్త పాలక మండలిని నియమించింది. దీనికి సంబందించిన ఉత్తర్వుల

జిఓ ఆర్‌à°Ÿà°¿ నెం 49ని విడుదల చేసింది. నూతనంగా ఏర్పాటైన పాలక మండలి మూడు సంవత్సరాల పదవీ కాలం తో పనిచేస్తుంది. వర్సిటీకి  à°µà±€à°²à±à°µà±ˆà°¨ సూచనలు అందించడం, పరిపాలనా పరమైన

నిర్ణయాలు తీసుకోవడంలో పాలక మండలి దోహదకారిగా నిలుస్తుంది.

పాలక మండలి సభ్యులుగా నియమితులైన వారు వీరే: 

ఏయూ సోషల్‌ వర్క్‌ విభాగం అధ్యాపకులు :

 à°Ÿà°¿.శోభశ్రీ, 
ఐఏఎస్‌à°‡ ప్రిన్సిపాల్‌ -  à°†à°°à±‌.శివ ప్రసాద్‌, 
వర్సిటీ కళాశాల (ఫ్యార్మశీ కళాశాల ) అధ్యాపకులు - ఏ.క్రిష్ణమంజరి పవార్‌, 
వర్సిటీ అనుబంధ కళాశాల నుంచి - (

వి.ఎస్‌ కృష్ణకళాశాల అధ్యాపకులు) డాక్టర్‌ సి.హెచ్‌.వి.à°Žà°‚.కె హరి, 
అనుబంధ కళాశాల ప్రిన్సిపాల్స్‌ విభాగంలో వెల్ఫేర్‌ కళాశా ప్రిన్సిపాల్‌ జేమ్స్‌ స్టీఫెన్‌,
/> పరిశ్రమలు, వాణిజ్యం, విద్య, న్యాయ, సామాజిక సేవా విభాగాల  à°¨à±à°‚à°šà°¿ 
కె.వి.ఎస్‌ ఆంజనేయ వర్మ, à°—à°¿à°°à°¿à°œ అగస్టీన్‌, వై.యేసుపాదం, 
డాక్టర్‌ à°Žà°‚.వి. సాయి దేవ మణి. 

రాష్ట్ర

ప్రభుత్వం పాలక మండలి సభ్యుల ఎంపికలో విభిన్న సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళలకు పెద్దపీట వేసింది. తొమ్మిది మంది సభ్యుల్లో 4 గురు మహిళలను నియమించడం

విశేషం. మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ, సామాజిక వర్గాల వారీగా సమతూకం పాటిస్తూ నూతన పాలక మండలి ఏర్పాటు అయ్యింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam