DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేవలం వీడియో మాత్రం తియ్యండి  బైట్ లు  తగ్గించండి 

*జాతీయ మీడియా సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సూచన* 

*వీలంతగా బయట తిరగవద్దు, ఆన్ లైన్ విధానం వాడండి* 

*మనకి మన కుటుంబాలు కూడా ముఖ్యమే. .

.* 

*మీడియా వారూ... పనిలేకుండా రోడ్ల ఫై తిరగ వద్దు :*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 25 , 2020 (డి ఎన్ ఎస్) : కొన్నాళ్ల పాటు కేవలం

వీడియో మాత్రమే తియ్యందని, వ్యక్తిగత బైట్ లు తియ్యవద్దని, మొత్తం పాత్రికేయులందరికి  à°œà°¾à°¤à±€à°¯ మీడియా సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సూచించారు. దేశ వ్యాప్తంగా

కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో సమాజ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న జర్నలిస్టులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అన్నారు. ఇప్పటికే

కొన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టులకు రెండు కేసులు ఉన్నట్టు గుర్తించారన్నారు. కాబట్టి మీడియా సోదరులు తక్షణమే అప్రమత్తం కావాలన్నారు. 

ఎట్టి

పరిస్థితుల్లోనూ, బయట తిరగడం తగ్గించుకుని, వీలయినంతగా సాంకేతిక పరిజ్ఞానం, ఆన్ లైన్ విధాన్ని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. పూర్తిగా లాక్ డౌన్

అయ్యినందున కేవలం అధికారులు, మంత్రులు మాత్రమే బైట్ ఇచ్చే అవకాశం ఉంది. వారి వెనుక ఉండే ప్రభుత్వ అధికారులు, అధికారిక సిబ్బంది ద్వారా వీడియో బైట్ లు తీయించి

మీడియా కార్యాలయాలకు పంపితే. . . టీవీ ఛానెల్ సిబ్బంది, వీడియో గ్రాఫర్లు, విలేకరులు బయట తిరగ వలసిన అవసరం అంతగా ఉండక పోవచ్చు. పైగా తదుపరి వివరాలకు వ్యక్తిగతంగా

వెళ్లవచ్చని సూచించారు. 

మనకి మన కుటుంబాలు కూడా ముఖ్యమే. . . 

సమాజంలో అందరూ మీడియా ను పూర్తిగా, బాగా ఉపయోగించుకునే వారే ఉన్నారని, మీడియా కు ఇబ్బంది

వస్తే ఆడుకునేవాళ్ళు మాత్రం లేరన్నారు. ప్రస్తుత భయంకర విపత్తుల పరిస్థితుల్లో మీరు à°’à°•à°Ÿà°¿ రెండు బైట్లు మిస్ ఆయినా సంస్థ అడగదు.  à°•à°¾à°¬à°Ÿà±à°Ÿà°¿ వీలంతగా సాంకేతిక

పరిజ్ఞానాన్ని మాత్రమే వాడాలని సూచించారు. 

ఇప్పడికే ఇతర రాష్ట్రాల్లో ఇద్దరు మీడియా ప్రతినిధులకు పాజిటివ్ వచ్చినట్టు సమాచారాలు వస్తున్నాయి. కాబట్టి

అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 

మీడియా వారూ... పనిలేకుండా రోడ్ల ఫై తిరగ వద్దు :

లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మీడియా వారికి విధులు

నిర్వహించడం కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. అయితే దీన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు పని లేకున్నా రోడ్లపై తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ

నేపథ్యంలోనే కొందరు విధుల్లో ఉన్న సిబ్బంది తో వాగ్వాదాలకు దిగుతున్నట్టు అభియోగాలు వస్తున్నాయన్నారు. 

ఇంతకాలం ఏంటో బిజీ గా పనిచేసిన మీడియా వారిని

కూడా రోజంతా రెస్ట్ తీసుకోండి అంటే ఉత్తుత్తినే రోడ్డు పైకి వస్తే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందన్నారు. మీడియా వారు సమాజానికి ఒక మార్గదర్శకంగా

ఉండాలన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam