DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం గుళ్లో లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ డౌన్ చేసిన అధికారులు  

*లాక్ డౌన్ నిబంధనలు అప్పన్న ఆలయానికి లేవా?*

*ఏకాంతంలో చెయ్యాల్సిన సేవలో అంతమంది అవసరమా?*

*అప్పన్న పెళ్లి రాట లో ట్రస్ట్ బోర్డు కి, అధికారులకు పనేంటి

?*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . . . .*

విశాఖపట్నం, మార్చి 25 , 2020 (డి ఎన్ ఎస్) : దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన నేపథ్యంలో సింహాచలం ఆలయంలో అధికారులు,

అర్చకులు నిబంధనలను పూర్తిగా తుంగలోకి తొక్కారు. గత వారం రోజులుగా సింహాచలం ఆలయాన్ని భక్తులకోసం పూర్తిగా మూసేసారు. అర్చనలు కూడా కేవలం అర్చకులు ఏకాంతంలో

జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే బుధవారం జరిగిన సింహాద్రి నాధుని పెళ్లి రాట మహోత్సవం కూడా కేవలం అర్చకులు మాత్రమే ఉండి జరిపించాల్సి ఉంది. అయితే

ఈ నిబంధనలను పూర్తిగా కాలరాస్తూ ఆలయ ఈఓ వెంకటేశ్వర రావు నేతృత్వంలో అర్చకులు, కొత్తగా నియమించబడిన ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఇతర సిబ్బంది, నగర ప్రముఖులు పెద్ద

సంఖ్యలో పాల్గొన్నారు. 

సామాజిక దూరం పాటించడం కోసం భక్తులను గుళ్ళోకి రాకుండా నిలిపేస్తే  à°ªà±†à°³à±à°²à°¿ రాట ఉత్సవం కోసం ఒకే చోట సుమారు 30 మంది పాల్గొనడం ఏంటి?

దేశంలోని లాక్ డౌన్ నిబంధనలు వీళ్ళకి అమలు కావా, లేదా వీళ్ళు నిబంధనలకు అతీతులా అనే ప్రశ్నలతో భక్తులు మండిపడుతున్నారు. 

ఏప్రిల్ 4న సింహాద్రి అప్పన్నకు

కళ్యాణం జరగనున్న నేపథ్యంలో ఉగాది రోజున బుధవారం వేదమంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో సాంప్రదాయబద్దంగా ఆలయ అర్చకులు వేదపండితులు స్వామి వారి పెళ్లి రాట వేయడం

జరిగింది 

పెళ్లి రాట ఉత్సవం కేవలం ఇద్దరు లేదా ముగ్గురు అర్చకులతో మాత్రమే జరపాల్సి యుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం అక్కడ ఈఓ కె పని ఉండదు.  à°‡à°²à°¾à°‚à°Ÿà°¿

నిబంధనలు ఉండగా నలుగురు అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికార గణం, మీడియా రిలేషన్స్ ప్రతినిధులు ఇలా సుమారు 30 మంది గుమ్మిగూడి ఉండడం ఆశ్చర్యకరంగా ఉందని

భక్తులు తెలియచేస్తున్నారు.  

 à°•à°°à±‹à°¨à°¾ వ్యాప్తి చెందుతోంది అంటూ దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం దేశ ప్రజలను రోడ్ల పైకి రావద్దంటూ

కర్ఫ్యూ విధించారు. తెలుగు రాష్ట్రాల్లోని  à°†à°²à°¯à°¾à°²à°¨à±à°¨à±€ మూసేస్తే. . . సింహాచల ఆలయంలో కూడా కేవలం అర్చకులు ఏకాంతంలో సేవలు చేస్తున్నారు. మరి à°ˆ పెళ్లి రాట కు, అనంతరం

తిరువీధి ఉత్సవానికి అంత పెద్ద సంఖ్యలో భక్తులు, అధికారులు ఎలా పాల్గొన్నారని విషయం పై ఆలయ ఈఓ సమాధానం చెప్పాల్సి యుందని భక్తులు డిమాండ్

చేస్తున్నారు. 

సింహాచల క్షేత్రం పూర్తిగా కార్యనిర్వహణాధికారి వ్యవస్థ పైనే నడుస్తోంది. అలాంటిది ఈ పెళ్లిరాట ఉత్సవానికి కేవలం అర్చకులు మాత్రమే ఉండాలి

అని ఆయన నిబంధన అమలు చేస్తే ఇంతమంది అక్కడకి వచ్చే వారే కాదు. ఈయన అనుమతి ఇవ్వడం వల్లనే సుమారు 30 మందికి పైగా హాజరు కాగలిగారని భక్తులు మండిపడుతున్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam