DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోక కల్యాణార్థం చిన్న జీయర్ స్వామి సుందరకాండ పారాయణ 

*కరోనా కట్టడికి వేలాది మంది తో ఆన్ లైన్ ద్వారా పారాయణలు* 

*ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా పీడ నశించాలని కోరుతూ. .*

*వసంత నవరాత్రి వేడుకలు

ప్రారంభం* 

*మార్చి 25 నుంచి ఏప్రిల్ 6 వరకూ సాగనున్న ఆదిత్య హృదయ పారాయణ* 

*మొన్న శ్రీవిష్ణు సహస్రం . . . నిన్నటి నుంచి సుందరకాండ. .*

*శంషాబాద్ ఆశ్రమం నుంచి

లైవ్ స్ట్రీమ్ లో పారాయణ*

*Youtube.com లో Jetworld  id ద్వారా à°‰ 8 à°—à°‚. నుంచి live లో* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 26 , 2020 (డి ఎన్ ఎస్) : ప్రపంచాన్ని

వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తి ని విస్తరించకుండా, కరోనా సహా, ఇతర విష జ్వరాల పీడ నుంచి à°ˆ ప్రపంచం రక్షింపబడాలని కాంక్షిస్తూ  à°ªà±à°°à°®à±à°– ఆధ్యాత్మిక వేత్త

త్రిదండి చిన్న జీయర్‌ స్వామి సుందరకాండ, ఆదిత్యహృదయం పారాయణ నిర్వహిస్తున్నారు. 

శంషాబాద్ జీయర్ ఆశ్రమం లోని శ్రీ సాకేత శ్రీరామచంద్ర ఆలయం లో వసంత

నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ శార్వరి నామ తెలుగు సంవత్సరాది వేడుకల్లో సుందరకాండ పారాయణ, ఆదిత్య హృదయ పారాయణ నిర్వహిస్తున్నారు. మార్చి 25 ,2020 ( బుధవారం ) మొదలైన ఈ

ప్రయాణాలు ఏప్రిల్ 6 à°µ తేదీ వరకూ నిరంతరం కొనసాగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం  à°†à°°à°¾à°§à°¨à°²à± అనంతరం 8 à°—à°‚à°Ÿà°² నుంచి కొనసాగనున్నాయి. 

ఈ కార్యక్రమం శంషాబాద్ లోని జీయర్

ఆశ్రమం నుంచి స్వామిజి youtube  à°²à±‹ jetworld ఐడి ద్వారా ఆన్ లైన్ ద్వారా ప్రసారం అవుతుంది. à°ˆ మహా యజ్ఞం లో వేలాదిగా భక్తులు తమ ఇళ్ల నుంచే పాల్గొంటున్నారు.  

ముందుగా కరోనా

చేస్తున్న విలయ తాండవాన్ని వివరిస్తూ . . . మానవ తప్పిదానికి ప్రమాదాలు ఎంత విపరీతంగా ఉంటాయో ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. దీని తక్షణం అరికట్టవలసిన ఆవశ్యకత

ఉందని, దీనికి మానవ కృషి à°•à°¿ దైవ సహకారం తోడు కావాల్సిన అవసరం ఉందన్నారు. 

శ్రీ సుందరకాండ  à°µà±ˆà°­à°µà°¾à°¨à±à°¨à°¿ వివరిస్తూ. . . సమాజం నుంచి కరోనా సహిత, అన్ని తరహాల విష

జ్వరాలు, వైరస్ లు, ఇతర గ్రహ పీడల బారినుంచి ఈ ప్రపంచం రక్షించబడాలని కాంక్షిస్తూ శ్రీరామ చంద్ర స్వామి అనుగ్రహం లభించాలని ఈ పారాయణ చేస్తున్నట్టు తెలిపారు. శత్రు

దుర్భేద్యమైన లంకను అత్యంత సునాయాసంగా ఛేదించిన శ్రీరామదూత హనుమంతునికి à°…à°‚à°¤ శక్తి కేవలం శ్రీరాముని అనుగ్రహం వల్లనే లభించిందన్నారు.  

ప్రస్తుత

సమాజానికి శ్రీరాముని అనుగ్రహం అవసరమని, à°ˆ పారాయణ ద్వారా శ్రీరాముని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. 

ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం లేనందున ఈ పారాయణ

ను ఇంటర్నెట్ ద్వారా యూట్యూబ్ ఛానల్ లోని  JET WORLD  à°à°¡à°¿  à°¦à±à°µà°¾à°°à°¾ ప్రసారం చేస్తున్నామని,  à°µà±‡à°²à°¾à°¦à°¿ మందితో ఆన్ లైన్ లో శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నట్టు

తెలియచేసారు. యావత్ భారత దేశమంతా లాక్ డౌన్ చేసినందున, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉండి, ఈ మహా యజ్ఞం లో పాల్గొనాల్సిందిగా చిన్న జీయర్ స్వామి పిలుపునిచ్చారు.

స్వామిజి పిలుపుకు వేలాదిగా భక్తులు స్పందించి, భారత దేశం లోనే కాక, విదేశాల్లోని భక్తులు సైతం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

ప్రభుత్వానికి సహకరించండి :

చిన్న జీయర్ .. .
ఈ వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు దేశ ప్రజలందరూ సహకరించాలని సూచించారు. ప్రజలందరూ స్వచ్చందంగా ఇళ్లకే

పరిమితమవ్వాలని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని సూచించారు. à°ˆ వైరస్‌ దేశ విదేశాల్లో విపరీతంగా ఉన్నందున భారత దేశంలో వ్యాప్తికి  à°•à°Ÿà±à°Ÿà°¡à°¿

చేసేందుకు భారత ప్రధాని నేరుగా పిలుపు నిచ్చారన్నారు. 

ఏప్రిల్ 14 వరకూ స్వచ్చందంగా కర్ఫ్యూ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. అవసరం లేకుండా ఇళ్ల నుంచి

బయటకు రావద్దని సూచించారు.  

తెలంగాణ లోని శంషాబాద్ లో à°—à°² జీయర్ ఆశ్రమం లోని దివ్య సంకేత ఆలయంలో జరిగిన à°ˆ పారాయణ లో  à°šà°¿à°¨à±à°¨ జీయర్ స్వామి తో పాటు

వేదవిద్యార్థులు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam