DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 2 కోట్ల విరాళం ప్రకటించిన జనసేనాని పవన్ 

*1 కోటి ప్రధాని సహాయ  à°¨à°¿à°§à°¿à°•à°¿, చెరో 50 లక్షలు ఏపీ, తెలంగాణలకు* 

*లాక్ డౌన్ ను అందరూ పాటించాలి : జనసేనాని పవన్ కళ్యాణ్* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్

కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 26, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ ఉపద్రవాన్ని తట్టుకునేందుకు జనసేన అధ్యక్షులు పవన్

కళ్యాణి రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. గురువారం జనసేన పార్టీ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించింది. ఒక కోటి రూపాయలను ప్రధానమంత్రి సహాయ నిధికి,

చెరో 50 లక్షల రూపాయలను ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి అందిస్తున్నట్టు ప్రకటించింది. అదే విధంగా పార్టీ లోకి క్యాడర్ కు ఈ విరాళాలను అందించే

ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. మొత్తం దేశం లాక్ డౌన్ అయినా నేపథ్యంలో ఈ విరాళాన్ని ప్రత్యక్షంగా అందించే అవకాశం లేనందున, బ్యాంకు అకౌంట్ ద్వారా బదిలీ

చేయవలసిందిగా సూచించారు. 
గత నెల 20 వ తేదీన భారతీయ సైనిక సంక్షేమ బోర్డు కు పవన్ కళ్యాణ్ ఒక కోటి రూపాయల విరాళాన్ని ప్రత్యక్షంగా ఆయనే ఇచ్చిన విషయం

తెలిసిందే. 

లాక్ డౌన్ ను అందరూ పాటించాలి : పవన్ కళ్యాణ్ 

ప్రధాన మంత్రి  à°¨à°°à±‡à°‚ద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ 14 వరకూ కొనసాగే 21 రోజుల లాక్ డౌన్ ను

అందరూ విధిగా పాటించాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. ఈ లాక్ డౌన్ కు అందరూ సహకరించాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వేరే దారి లేదు. కేంద్ర,

రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సూచనలను అనుసరించండి.  à°¦à°¯à°šà±‡à°¸à°¿ అందరూ ఇంటికే పరిమితం కావాలని కోరుతున్నాను. బయటికి ఎవరు రావద్దు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా,

ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనా ఎమర్జెన్సీ నెంబర్లకు ఫోన్ చేసి సేవలు, సూచనలు పొందండి. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సహకరించాలని

కోరుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam