DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పవర్ ఆఫ్ శ్రీకాకుళం వాట్సాప్ గ్రూపు రూ.1.25 లక్షల విరాళం

కరోనా సహాయం పై జిల్లా కలెక్టర్ నివాస్ అభినందనలు 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 26, 2020 (డి ఎన్ ఎస్) : కరోనా మహామ్మారిని

తరిమికొట్టేందుకు,సహాక చర్యలు అందించేందుకు శ్రీకాకుళం నగరంలో గల "పవర్ ఆఫ్ శ్రీకాకుళం " వాట్సప్ గ్రూపు సభ్యులు స్పందించి స్వచ్చంధంగా ముందుకు రావడం

అభినందనీయమని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. తాను ఇచ్చిన పిలుపు మేరకు సామాజిక బాధ్యతతో రూ.1.25లక్షల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవర్ ఆఫ్ శ్రీకాకుళం

వాట్సప్ గ్రూపు సభ్యులు అందించడం ప్రశంసనీయమన్నారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పవర్ ఆఫ్ శ్రీకాకుళం గ్రూపు సభ్యులు జిల్లా కలెక్టర్ నివాస్ ను

గురువారం ఉదయం కలుసుకుని గ్రూప సభ్యుల నుంచి సేకరించిన రూ.1.25 లక్షల చెక్కును అందజేసారు. కరోనా సహాయక చర్యలకు ఆ మొత్తాన్ని వినియోగించాలని గ్రూపు సభ్యులు జిల్లా

కలెక్టర్ నివాస్ కి విన్నవించారు. అలాగే పవర్ ఆఫ్ శ్రీకాకుళం గ్రూపు సభ్యులంతా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గోనేందుకు ముందు ఉంటామని తమ సేవలను సైతం అత్యవసర

సమయంలో వినియోగించుకోవాలని సభ్యులు తెలియజేసారు. తప్పకుండా సేవలు వినియోగించుకుంటామని నంబర్లు తమ కార్యాలయంలో ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వాట్సాప్ గ్రూపు

సభ్యుల స్పందన,ఉత్సాహాన్ని  à°šà±‚సి జిల్లా కలెక్టర్ నివాస్ ఆనందం వ్యక్తం చేసారు. జిల్లాలో చేపడుతున్న కరోనా సహాయక చర్యలను ఆయన వివరించారు.సామాజిక బాధ్యతతో

విరాళాలు ఇవ్వాలని తాను చేసిన ప్రకటనకి దాతలు స్పందిస్తున్నారన్నారు. సోషల్ మీడియా గ్రూపుగా ఉన్న "పవర్ ఆఫ్ శ్రీకాకుళం" వాట్సప్ గ్రూపు సామాజిక కార్యక్రమాలలో

ముందు ఉండడం అభినందనీయమన్నారు. గ్రూపు సభ్యులందరికి కూడా కలెక్టర్ అభినందనలు తెలియజేసారు. 

అనురాగ నిలయానికి నిత్యావసర సరుకులు పంపిణీ: . .

బియ్యం,

కూరగాయలు అందజేసిన "పవర్ ఆఫ్ శ్రీకాకుళం" గ్రూపు సభ్యులు
నగరంలోని ఆర్ అండ్ బి అతిధి గృహం వద్ద ఉన్న రెడ్ క్రాస్ ఆద్వర్యంలోని శాంతా కళ్యాణ్ అనురాగ నిలయానికి

"పవర్ ఆఫ్ శ్రీకాకుళం" వాట్సప్ గ్రూపు సభ్యులు గురువారం ఉదయం బియ్యం,కూరగాయలు వంటి నిత్యావసర సరుకులను అందజేసారు. గ్రూపు సభ్యులైన గిడుతూరి

వెంకటేశ్వరరావు,కర్రా భాస్కరరావు కుటుంబం తరపున 4 బస్తాల బియ్యం, ఉల్లిపాయలు,బంగాళ దుంపల బస్తాలు, ఆనపకాయలు, వంకాయలు, ములక్యాయలు వంటి కూరగాయలను అందజేయగా వాటిని

అనురాగ నిలయం నిర్వాహకులకు అందజేసారు.

à°ˆ కార్యక్రమంలో  à°ªà°µà°°à± ఆఫ్ శ్రీకాకుళం గ్రూపు అడ్మిన్  à°¤à±ˆà°•à±à°µà°¾à°‚డో శ్రీనుతో పాటు సభ్యులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ,

మండవల్లి రవి , తిరువీదుల మోహిని, మెట్ట నాగరాజు, శాలిహుండం కృష్ణకాంత్ ,కెల్ల చిన్ని,  à°¡à±‹à°² బాలు,  గిడుతూరి వెంకటేశ్వరరావు, నానాజీ సిల్స్ రాజా, బెవర జ్యోతిప్రసాద్ ,

వైశ్యరాజు మోహన్ , జామి కిరణ్, నగేష్ మాస్టారు, సుబ్రహ్మణ్యం, జోగుపాటి వంశీ, మజ్జి గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam