DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆన్ లైన్ తరగతులతో ఆదర్శంగా నిలుస్తున్న శ్రీవైష్ణవ గోష్ఠి

*ఆధ్యాత్మిక రంగంలో ఆన్ లైన్ ద్వారా చిన్నారులకు శిక్షణ*

*ఖండాతరాల నుంచి పాల్గొంటున్న బాలబాలికలు*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, మార్చి 28 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా కట్టడి తో భారత దేశం తో పాటు ఇతర దేశాల్లో సైతం ఇళ్లకే పరిమితమైన చిన్నారులను ఆధ్యాత్మిక రంగం లో తీర్చిదిద్దుతూ

శ్రీవైష్ణవ గోష్ఠి అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. కేజీ నుంచి పిజి వరకూ అందరూ ఇళ్లకే పరిమితమవడంతో చిన్నారులకు ఆధ్యాత్మిక పరమైన అంశాలను, శ్లోకాలను

నేర్పించడం ద్వారా కాలాన్ని సద్వినియోగం చెయ్యాలి అనే సంకల్పంతో శ్రీవైష్ణవ గోష్ఠి బృదం ఆన్ లైన్ తరగతులను ప్రారంభించింది. 
ఈ తరగతులను ఇంటర్నెట్ ద్వారా

వీడియో లో అందరూ ఒక యాప్ లో కనెక్ట్ అయి ఒక నిర్దుష్ట సమయంలో పలు శ్లోకాలను అభ్యసిస్తున్నారు. ఈ కార్యక్రమం లో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, బెంగుళూరు, చెన్నై,

బ్రంఫ్టన్ (కెనడా) నుంచి చిన్నారులను ఈ శిబిరం లో పాల్గొంటున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన అధ్యాపకులు మరంగంటి విజయ్ శ్రీనివాస్, విశాఖ పట్నం కు చెందిన

ముడుంబై లక్ష్మి శ్రీనివాస్ à°² పర్యవేక్షణలో à°ˆ తరగతులు నిర్వహించబడుతున్నాయి.  

ముందుగా ప్రార్ధన శ్లోకాలు శ్రీశైలేశ దయాపాత్రం . ..  à°¤à±‹ ప్రారంభించి, లక్ష్మి

అష్టోత్తరం, శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, ముకుందమాల, ఆదిత్య హృదయం, సంక్షేప రామాయణం తదితర అమూల్య స్తోత్ర రత్నాలను నేర్పించడం జరుగుతోంది. 

అనంతరం

చిన్నారులలో ప్రతిభను వెలికి తీసే ప్రక్రియ లో భాగంగా చిత్రలేఖనం, కధలు, గీతాలాపన తదితర అంశాలను ప్రదర్శిస్తున్నారు. 

ఈ శిబిరంలో కెనడా నుంచి శ్రీ కౌస్తుభ్,

శ్రీ సుహిత్, శ్రీవిద్య, విశాఖపట్నం నుంచి రామ్ నారాయణ, సివిరామన్, సాయిరాం, కళ్యాణి,  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం నుంచి నీలకృష్ణ, మౌద్గల్య, వనజ, రంగాచార్యులు, కృష్ణవేణి,

రామలక్ష్మి, ఆశ్రిత, హరిణి, బెంగుళూరు నుంచి రుక్మిణి ప్రజ్వలిత, శ్రీ వత్సాంకిత్, వైభవి, మారుతి లతా, సత్యభామ తదితరులు పాల్గొన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam