DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం లో ఇంటి ముంగిటకే రైతు బజార్లు   

*మొబైల్ రైతుబజార్లను ప్రారంభించిన జె.సి*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 28, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°•à°°à±‹à°¨à°¾ నియంత్రణ చర్యల్లో

భాగంగా ప్రజల సౌకర్యార్ధం ఇంటి ముంగిట కె రైతు బజార్లను తీసుకు వచ్చే బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు.  à°ˆ మేరకు ఏర్పాటు

చేసిన మొబైల్ రైతుబజార్లను శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ à°¡à°¾. కె.శ్రీనివాసులు స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభించారు. 
à°ˆ

సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నివారణకు జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసామని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నగరంలోని ఐదు చోట్ల

కూరగాయల మార్కెట్లను ఏర్పాటుచేసామన్నారు. అలాగే ఫోన్ చేస్తే ఇంటివద్దకే నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు.

దీంతో ప్రజలు ఆరుబయటకు రాకుండా వారికి కావలసిన నిత్యావసర సరుకులు, మందులు ఇంటివద్దేనే పొందేందుకు అవకాశం కలిగిందని, కరోనా మహమ్మారి నుండి రక్షణ పొందడమే

కాకుండా సమయం కూడా ఆదా అవుతుందని చెప్పారు. ప్రజలకు మరింత మేలు చేకూరేలా నేడు మొబైల్ రైతు బజార్లను కూడా ప్రారంభించడం జరిగిందని, దీంతో ప్రజలు వారి ఉన్న చోటనే

కూరగాయలు, నిత్యావసర సరుకులు పొందేందుకు వీలుకలుగుతుందని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాటుచేసిన ఈ సౌకర్యాలను ప్రతీ ఒక్కరూ

సద్వినియోగం చేసుకోవాలని, అందరూ గృహాల్లోనే ఉండాలని, ఆరుబయట తిరగరాదని ఆయన పేర్కొన్నారు. 
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని ఆయన

కోరారు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలోనే ప్రజలు బయటకురావాలని, బయటకు వెళ్లినపుడు గుంపులుగా ఉండరాదన్నారు. ఖచ్చితంగా సమాజిక దూరాన్ని పాటించాలని, అవసరమైతే

మాస్కులను లేదా చేతిరుమాలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.      à°ˆ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam