DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యవసాయ సంబంధిత పనులకు లాక్ డౌన్ నుండి మినహాయింపు 

*అందుబాటులో ఆహారధాన్యాలు - యధావిధిగా పంట కోతలకు ఒకే* 

*విపత్తు నిర్వహణ చట్టం కింద మార్గదర్శకాలు సవరించిన హోం శాఖ*

*ప్రధాని, హోమ్ మంత్రి కి వ్యవసాయ

మంత్రి తోమర్ కృతజ్ఞతలు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 28 , 2020 (డిఎన్ఎస్) : ప్రస్తుత ఆపత్కాలంలో రైతులకు అండగా ఉండేందుకు

కేంద్రం కొన్ని ముఖ్యమైన చర్యలను ప్రకటించింది. లాక్ డౌన్ రైతులకు ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు, వ్యవసాయ, వ్యవసాయాధారిత కార్యకలాపాలను దేశవ్యాప్తంగా

ఉన్న ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చింది. పంట కోతలకు కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వంప్రకటించింది. ఈ సందర్బంగా

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్- ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా కు

కృతజ్ఞతలు తెలిపారు.   

లాక్ డౌన్ విధించిన దగ్గర నుండి కేంద్ర మంత్రి శ్రీ తోమర్ రైతులకు సంబంధించిన వివిధ అంశాలను నిరంతరంగా సమీక్షిస్తున్నారు. పంట కోతకు

వచ్చే ప్రస్తుత కాలం, పంట చేతికి రావడం, ఆహార ధాన్యాలను మార్కెట్లకు తరలించడంలో రైతులు ఎదుర్కొనే సమస్యలపై ఆయన దృష్టి పెట్టారు.  à°ˆ నేపథ్యంలో రైతులు, రైతు సంఘాలు

నుండి వచ్చిన డిమాండ్లు, ప్రధాని సూచనలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం సానుభూతితో అలోచించి రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఆచరణాత్మకమైన పరిష్కారానికి

వచ్చింది. 

విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్  10(2)(I) à°•à°¿à°‚à°¦ తనకున్న అధికారాలను వినియోగిస్తూ  à°¦à±‡à°¶à°µà±à°¯à°¾à°ªà±à°¤ లాక్ డౌన్ à°•à°¿ జారీ చేసిన ఆర్డర్ నెం. 40-3/2020-DM-I(A) à°•à°¿à°‚à°¦ ఉన్న

మార్గదర్శకాలలో సవరణలు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. దీని ద్వారా వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన కార్యకలాపాలను, సర్వీసులను  21

రోజుల లాక్ డౌన్ నుండి మినహాయించే జాబితాలో చేర్చారు. పంట నూర్పిళ్ళు కూడా సజావుగా సాగేలా ఇది తోడ్పడుతుంది.  à°µà±à°¯à°µà°¸à°¾à°¯à°‚ మరియు అనుబంధ కార్యకలాపాలకు మినహాయింపులు

మంజూరు చేసినందుకు వ్యవసాయ మంత్రి ప్రధానమంత్రి మరియు కేంద్ర హోంమంత్రిని అభినందించారు. తాజా ఉత్తర్వుల్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేర్చిన రెండవ అనుబంధంలో

ఈ మినహాయింపులను చేర్చారు:

1. కనీస మద్దతు ధర తో పాటు వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో పాలుపంచుకొని ఏజెన్సీలు;

2. వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్వహించే మండీలు

(మార్కెట్లు) లేదా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రకారం ఉన్న ఏర్పాట్లు;

3. పంటపొలాల్లో పని చేసే వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు 

4. వ్యవసాయ

యంత్రాలకు సంబంధించిన కస్టమ్ హైరింగ్ సెంటర్లు (సిహెచ్ సి);

5. ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాలు ప్యాకేజింగ్, తయారీ కేంద్రాలు;

6. కోతలు ఇతర వ్యవసాయ

యంత్రాలు, ఉద్యానవన అవసరాలకు సంబంధించి యంత్రాల రాష్ట్రం లోపల, బయట కూడా రాకపోకలు 

లాక్ డౌన్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల ప్రభావం సామాన్య ప్రజలకు అత్యవసర

ఆహార ఉత్పత్తులను అందించే రైతులపై పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తగు ఆదేశాలు జారీ

చేసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam