DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*కరోనా కట్టడి కోసం వేద పాఠశాలలో లక్ష ధన్వంతరి హోమం* 

*విశ్వ శ్రేయస్సు కోసం సప్తఋషి వేద పాఠశాల విద్యార్థుల జపం* 

*దువ్వాడ పాఠశాలలో దివారాత్రాలు సాగుతున్న జప, హోమాదులు* 

*కరోనా బారిన పడ్డ ప్రతి ఒక్కరూ

ఆరోగ్యవంతులు కావాలి: మాధవ శర్మ* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 29 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం

విశాఖనగరం శివారు ప్రాంతమైన దువ్వాడ లో గల సప్తఋషి వేద పాఠశాల లోని వేదవిద్యార్థులు ఈ నెల 23 నుంచి నిరంతర ధన్వంతరి హోమం నిర్వహిస్తున్నట్టు వేద పాఠశాల

వ్యవస్థాపకులు, వేద విద్యా అధ్యాపకులు మావిళ్ళపల్లి మాధవశర్మ తెలియచేసారు. ఆదివారం సాయంత్రం హోమ ప్రక్రియవిధి ముగిసిన అనంతరం ఆయన à°¡à°¿ ఎన్ ఎస్  à°¤à±‹ మాట్లాడుతూ

అత్యంత కట్టుదిట్టమైన దీక్షగా సాగుతున్న ఈ హోమం దీక్షలో ప్రధాన లక్ష్యం ఈ మానవాళిని ఇబ్బంది పెడుతున్న కరోనా మహమ్మారిని పారద్రోలడమే. సప్తఋషి చారిటబుల్

ట్రస్ట్ ఆధ్వర్యవం లో నిర్వహించబడుతుంది ఈ వేద పాఠశాల లో శిక్షణ పొందుతున్న చిన్నారి వేద విద్యార్థులు, అధ్యాపకులు, ఇప్పడికే వేద శిక్షణ పూర్తి చేసుకున్న

విద్యార్థులు అకుంఠిత దీక్షగా ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 23 న ప్రారంభమైన ఈ మహా క్రతువు లో కరోనా కట్టడి కోసం వేద పాఠశాలలో లక్ష ధన్వంతరి హోమం, విశ్వ

శ్రేయస్సు కోసం దివారాత్రాలు (రాత్రి, పగలు) జప, హోమాదులను నిర్వహిస్తున్నారు.  

అధర్వణ వేదంలో సూచించిన విధంగా క్రిమి రోగ నివారణ సూక్త హోమన్ని చేపట్టడం

జరిగిందని తెలియచేసారు. వేదమాత అనుగ్రహంతో కరోనా మహమ్మారి అంతరించి పోవాలని, వైద్య బృందాలు చేస్తున్న వైద్య చికిత్సకు పూర్తి దైవ సహకారం లభించి, ఇప్పడికే ఈ

బారిన పడిన వారికి పూర్తి ఆరోగ్యం లభించాలని, మరొక కేసు కూడా పాజిటివ్ రాకుండా ఉండాలని కోరుతూ తమ వేద పాఠశాల విద్యార్థులు ఈ లక్ష ధన్వంతరి హోమాన్ని, జపాన్ని

నిర్వహించినట్టు తెలిపారు.  

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam