DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రబాబు ని బంగాళా ఖాతం లో కలపక తప్పదు : వైకాపా ట్రేడ్ నేత గౌతమ్ రెడ్డి

42 కార్మిక డిమాండ్లు నెరవేర్చాల్సిందే ...
 
విశాఖపట్నం, జులై  01 , 2018 (DNS Online ) :అత్యంత అందమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో రావణ రాజ్యం సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ

అధినేత చంద్రబాబు నాయుడిని బంగాళా ఖాతం లో కలపక తప్పదు అని యావత్ కార్మిక లోకం భావిస్తోందని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షులు గౌతమ్

రెడ్డి ప్రకటించారు. ఆదివారం విశాఖపట్నం లోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో జరిగిన కార్మిక సదస్సు లో అయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా

అయన మాట్లాడుతూ ఈ రాష్ట్రం లో సమస్యలతో రావణ కాష్టం కాలుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుపోయిందని మండిపడ్డారు. విద్యార్థులు, యువజనులు, మహిళలు. నానా అవస్థలు

పడుతున్నారని, ఎన్నికల ముందు బాబు వస్తే ఇంటికో జాబు వస్తుంది అన్నాడు, వాళ్ళ బాబు కి మాత్రం జాబు ఇచ్చాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, దాని మాటే మరిచిపోయాడు. ఇక మహిళల

సమస్యల పరిష్కారం కాదు, ఈ ప్రభుత్వమే మహిళా లోకానికి కంటకంగా మారిందన్నారు. ఈ రాష్ట్రం లో ఉన్న మూడున్నర లక్షల కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని,

సమాన పనికి సమాన వేతనం ఇస్తానని మాట ఇచ్చాడు, వాళ్లకి ప్రతిబంధకంగా మారాడు. ఒక్కరిని కూడా పర్మనెంట్ చెయ్యని పరిస్థితి ఉందని, దీనికి సమాధానం చెప్పకుండా మాట

దాటవేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు విరుద్ధంగా జిఓ 151 ని విడుదల చేసి ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ సంస్థల్లోని ఉద్యోగుల ఆశలని గోరీ కట్టాడన్నారు,

వీళ్ళకి à°Ÿà°¿à°Ž, పీఎఫ్ లు, డీఏ లు ఇవ్వని పరిస్థితి తీసుకువచ్చాడని ఎద్దేవా చేశారు.  70  à°µà±‡à°² మందిని ఉద్యోగులను ఉన్నపళంగా తీసేసాడు. దీనికి జవాబు లేదన్నారు. 

విశాఖ

స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వండి అని ముప్పై ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా లేవు అని పోరాటం చేస్తున్న పట్టుంచుకొని చంద్రబాబు, తన బినామీ సీఎం రమేష్ తో కడప

స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష కి కూర్చోబెట్టి సొంతంగానే నిధులు ఇస్తాం, సొంతంగానే స్టీల్ ఫ్యాక్టరీ కడతాం అని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని

ప్రాంతాల వారీగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. 
కార్మికులకు ఇచ్చిన 42 డిమాండ్లను తక్షణం నెరవేర్చే దిశగా చర్యలు తీసుకొని పక్షం లో యావత్ కార్మిక

లోకం à°ˆ రాష్ట్రం లో తెలుగుదేశానికి పుట్టగతులు లేకుండా చేస్తాయని హెచ్చరించారు. 

ఈ రాష్ట్రం లో మహిళా ఉద్యోగులకు ఆరు నెలల మెటర్నిటీ లీవు ఇస్తా అన్నాడు,

ఇప్పడికి ఠికానా లేదు. కేవలం 1 రూపాయికే అల్పాహారం అని ప్రకటన చేశారు, కేవలం 5  à°°à±‚పాయలకే  à°­à±‹à°œà°¨à°‚ ఇస్తాం అన్నాడు. అది ఎక్కడ పెట్టాడో తెలియదు, ఎప్పుడు అమలుచేశాడో

ఎవరికీ తెలియదు అని ఎద్దేవా చేశారు. యావత్ కార్మిక లోకాన్ని నట్టేట ముంచిన చంద్రబాబు కు రానున్న కాలం గడ్డుకాలమేనన్నారు. ఈ కార్యక్రమం లో గ్రేట్ విశాఖ పట్నం

మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గల ప్రభుత్వ రంగ, ప్రయివేట్ రంగ పరిశ్రమల్లో విధులు నిర్వహిస్తున్న కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు

పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam