DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరికీ పాజిటివ్ లక్షణాలు. . 

*రాజమండ్రి, కాకినాడలలో నమోదు, ఆసుపత్రికి తరలింపు* 

*కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ల్లో బెడ్ లు సిద్ధం* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్,

అమరావతి :). . .*

అమరావతి , మార్చి 30, 2020 (డి ఎన్ ఎస్) : తూర్పు గోదావరి జిల్లాలో మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తెలియడం తో జిల్లా యంత్రాంగం అప్రమత్తం

అయ్యింది.  à°ˆ నేపధ్యం లో తూర్పు గోదావరి జిల్లా వైద్య అధికారి రమేష్ కిషోర్ జిల్లాలో కరోనా వ్యాప్తి అదుపునకు తీసుకుంటున్న చర్యలను à°¡à°¿ ఎన్ ఎస్ కు  à°µà°¿à°µà°°à°¿à°‚చారు. ఆయన

అందించిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం లోని జి ఎస్ ఎల్ ఆసుపత్రిలో 200 పడకల ను (2 మీటర్ల దూరంలోను) సిద్ధం చేశామని, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 150 పడకలను (2 మీటర్ల

దూరంలోను), మరో 30 సింగల్ పథకాలను ప్రత్యేకంగా సిద్ధం చేశామని, దీనికి అదనంగా అమలాపురం ( విదేశాల నుంచి అధికంగా ప్రజలు రాకపోకలు ఉన్న ప్రాంతాలు కావడం ) లోని ప్రభుత్వ

ఆసుపత్రిలో మరో 200 పడకలను సిద్ధం చేసినట్టు తెలిపారు. 

ఇద్దరికీ పాజిటివ్ లక్షణాలు .. .అప్రమత్తం :

ఈ నెల 14 న ఢిల్లీ లో జరిగిన ఒక విదేశీ మత సంబంధ భారీ

సమావేశంలో పాల్గొన్న వారిలో ఒకరు కాకినాడకు, ఇంకొకరు రాజమహేంద్రవరానికి చెందినవారు ఈనెల 17 న తిరిగి రావడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరానికి నుంచి వెళ్లిన

వ్యక్తి కోరుకొండ రోడ్ లోని శాంతి నగర్ కు చెందిన వ్యక్తిగా డాక్టర్ తెలిపారు. వీరిద్దరూ ఒకే ట్రావెల్స్ లో ప్రయాణించడం ద్వారా వీరికి వ్యాధి లక్షణాలు

కనిపించాయన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడం తో తక్షణం వీరిని సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించినట్టు రమేష్ తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam