DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిరంతరం ప్రజా సేవలో తరిస్తాం: బలగ ఫౌండేషన్ ప్రకాష్ 

*టెక్కలి లో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాం*

*శ్రీకాకుళం జర్నలిస్టులకు నిత్యావసరాల పంపిణీ. . .*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో ,

శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 31, 2020 (డి ఎన్ ఎస్) : నిరంతరం ప్రజా సేవలో తరిస్తామని, ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్రభుత్వ స్థలం కేటాయిస్తే 100 పడకల

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని బలగ ఫౌండేషన్ ద్వారా నిర్మిస్తామని ఫౌండేషన్ చైర్మన్ బలగ ప్రకాష్ ప్రకటించారు. సమాజ శ్రేయస్సులో తమవంతు భాద్యత గా నిరంతరం

శ్రమిస్తున్న పాత్రికేయులకు తమ వంతు సంఘీభావంగా నిత్యావసర సామాగ్రిని ఆయన అందించారు. శ్రీకాకుళంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమం లో జిల్లా సమాచార శాఖా

అధికారి ఎల్ రమేష్ ఆధ్వర్యవం లో పాత్రికేయులకు à°ˆ సామాగ్రిని అందచేశారు. 

ప్రజల కోసం తన వంతు భాద్యతలను ఇంకా ఎంతో నెరవేర్చాల్సి యుందని,  à°¤à°¨ సొంత నిధులతో

ఉచితంగా ఒక 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ప్రభుత్వానికి అప్పగిస్తానని, నిర్వహణ బాధ్యతలను మాత్రం ప్రభుత్వం నిర్వహించాలని ప్రకాష్

కోరారు. 

శ్రీకాకుళం నగరంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో బలగ ఫౌండేషన్ ఆద్వర్యంలో జర్నలిస్టులకి నిత్యావసర సరుకుల కిట్ ల పంపిణీ కార్యక్రమంలో ఆయన

పాల్గోన్నారు.

ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు సహాయం చేసేందుకు బలగ ఫౌండేషన్ చైర్మన్ బలగ ప్రకాష్ ముందుకు

రావడం అభినందనీయమన్నారు. కరోనా వ్యాధిని అరికట్టడంలో ప్రభుత్వం చేస్తున్న చర్యలను,అలాగే ప్రజలు తీసుకోవాలని జాగ్రత్తలపై అవగాహన కల్గించడంలో జర్నలిస్టులు

కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. అటువంటి వారికి చిరు సహాయం చేయడం నిజంగా అద్భుతమన్నారు. జర్నలిస్టులు సైతం వృత్తి ధర్మంలో స్వీయ రక్షణ చర్యలు పాటించాలని

క్షేత్ర స్థాయిలో సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేసారు.

యావత్ ప్రపంచాన్ని కరోనా వ్యాధి భయపెడుతున్నా వృత్తి ధర్మం కోసం ప్రభుత్వాలకు,ప్రజలకు మద్య

వారధులుగా పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు.అష్టకష్టాలు ఎదురవుతున్నా వారు వృత్తిలో రాణిస్తున్నారన్నారు. ఈక్రమంలో బలగ పౌండేషన్ ద్వారా

వారికి చిరు సహాయంగా నిత్యావసర సరుకులను అందజేయాలని నిర్ణయించి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తనకు అవకాశం ఉన్నంత వరకూ రాజకీయాలకు అతీతంగా సామాజిక సేవా

కార్యక్రమాలలో తన వంతు సహాయ కార్యక్రమాలను చేపడతానని బలగ ప్రకాష్ స్పష్టం చేసారు.

ఈ కార్యక్రమంలో గీతా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ ,

కళానికేతన్ నిర్వాహకురాలు మోహిని చౌదరి, కెల్ల చిన్ని, కోరాడ హరగోపాల్, వైశ్యరాజు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam