DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ -19 నివారణ - చర్యలు పై సీఎస్ నీలం సహాని సమీక్ష

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 31, 2020 (డిఎన్ఎస్) : కోవిడ్ -19 నివారణ, ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు పై గ్రామం నుంచి నగరాల వరకూ ప్రతీ

ఇంటింటిని సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ సూచించారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని జిల్లా కలెక్టర్లుతో

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మురికి వాడల్లో ప్రధానంగా పారిశుధ్యం పటిష్టంగా నిర్వహించాలన్నారు. సర్వే టీంలను వార్డుల లోకి పంపి సర్వే చేసేందుకు చర్యలు

తీసుకోవాలని చెప్పారు. ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఎఎన్ఎం లను సర్వేకు పంపాలన్నారు. కోవిడ్-19 లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారిని ఐసోలేషన్ కు తరలించాలని

సూచించారు. 

విశాఖ జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ మాట్లాడుతూ 6 పాజిటివ్ కేసులు ఉన్నాయని, ఇందులో ఒకరు బాగా కోలుకుని నెగిటివ్ రిపోర్ట్ వచ్చినందు వలన ఒకరిని

ఆసుపత్రి నుండి డిస్చార్జ్ చేసినట్లు తెలిపారు. మిగిలిన ఐదుగురు కోలుకుంటునట్లు వివరించారు.

విదేశాల నుండి వచ్చే వారిలో ఎవరికైనా కోవిడ్ - 19 లక్షణాలు ఉంటే

అలాంటి వారిని ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) అధికారులు, సిబ్బంది పారిశుధ్యం, ప్రెవెంటిక్ మరియు కంట్రోల్

చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. నగర పరిధిలో ఇంటింట సర్వే చేస్తున్నట్లు చెప్పారు. 

ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్

రెడ్డి, తదితరులు ఉన్నారు. 
ఈ సమావేశంలో విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎల్ శివ శంకర్, ఎం వేణుగోపాల్ రెడ్డి, జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి సృజన, పాడేరు సబ్

కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ తిరుపతిరావు, ఎఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, డిఆర్డిఎ పిడి

విశ్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam